టాలీవుడ్ లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏం మాయ చేసావే’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సమంత. ఈ మూవీ మంచి హిట్ కాగానే తెలుగు లో వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. తెలుగు, తమిళ భాషల్లో తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఏం మాయ చేసావే మూవీలో నటించిన నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వివాహం తర్వాత సమంత సినిమాలకు గుడ్ బాయ్ చెబుతుందని అందరూ భావించారు.. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. వివాహం తర్వాత సమంత నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ మద్య ఓ బేబీ లాంటి ప్రయోగాత్మక సినిమాతో మంచి విజయం అందుకుంది సమంత.
ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్ సీరీస్ పై దృష్టి సారిస్తుంది. వివాహం తర్వాత గ్లామర్ పాత్రలకు గుడ్ బాయ్ చెప్పి ప్రయోగాత్మక పాత్రలు మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్రలే ఎంచుకుంటుంది. ప్రస్తుతం సబ్జెక్ట్లు ఎంచుకోవడంలో పాటిస్తున్న జాగ్రత్తల వల్ల ఆమె కొన్ని సినిమాలను చేయలేకపోతోంది. వాస్తవానికి సమంతకు ఉన్న క్రేజ్ కి ఇప్పుడు వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఆ మద్య సమంత, నాగ చైతన్య జంటగా నటించిన ‘మజిలీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో నాగ చైతన్య భార్యగా ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీలో ఓ పల్లెటూరి అమ్మాయిగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
అయితే తనకు నచ్చే, ఛాలెంజింగ్గా ఉండే పాత్రలతో ఎవరైనా తనకు ఆఫర్ ఇస్తే… రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమేనని చెప్పింది సమంత. పాత్ర నచ్చితే మాత్రం తన పారితోషికాన్ని తగ్గించేసి సినిమా చేసేందుకు సిద్ధమని అంటోంది. ఇక ముందు తాను నటించే ఏ సినిమా అయినా ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునేలా ఉండాలని.. తన కెరీర్లో మరచిపోలేని సినిమాలు ఉండిపోవాలనే లక్షంతోనే సమంత ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.