స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రీకుడు త్రివిక్రం కలిసి హ్యాట్రిక్ హిట్ కోసం తపిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోంది. అల వైకుంఠపురములో పేరుతో బన్ని సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు రావాల్సిన బజ్ వచ్చేసింది. అందులో సందేహం లేదు. హారిక హాసిని స్వంతగా పెట్టుకున్న డిజిటల్ టీమ్ ఎఫెక్ట్ అది అని ఖచ్చితంగా చెప్పాలి. బన్నీ డిజిటల్ టీమ్ కన్నా హారిక హాసిని డిజిటల్ టీమ్ వల్లనే వెబ్ మీడియాలో ఆ సినిమాకు ఇంతగా బజ్ వచ్చిందన్నది ఎవరైనా ఒప్పుకొని తీరాలి. అది వందై వంద శాతం వాత్సవం కూడా. అయితే ఎలా వచ్చినా క్రెడిట్ అందరూ పంచుకుంటున్నారు. ఓకె.

 

మరి సినిమా సంగతి పక్కన పెడితే బన్నీ కోసం ఆయన డిజిటల్ లేదా స్వంత టీమ్ ఏం చేస్తున్నారన్నది పాయింట్. మహేష్ సినిమా ఈవెంట్ 5న జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి విపరీతమైన బజ్ వుంది. కానీ బన్నీ సినిమా ఫంక్షన్ 6న జరుగుతోంది. అయితే ఎక్కడా దీనిగురించి చెప్పడం లేదు. నిజానికి హై రేంజ్ లో క్రేజ్ రావాల్సింది ఫ్యాన్స్ లో. సోషల్ మీడియాలో వైరల్ కావాల్సింది ఫ్యాన్స్ ద్వారా. దీనికోసం కామన్ డీపీ, కామన్ విడియో బైట్ ఇలా చాలా చాలా చేయాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి వ్యవహారాలే లేవు. అటు మహేష్ కు సెపరేట్ గా ఓ టీమ్ మొత్తం ప్రచారం కోసం వర్క్ చేస్తోందని తాజా సమాచారం. అదే టీమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంది. కానీ ఆ విషయంలో బన్నీ టీమ్ కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది.

 

ఇప్పుడు ఇంత దగ్గరకు వచ్చాక సమస్య గమనించి హారిక హాసిని సంస్థ ఫంక్షన్ విషయంలో కిందా మీదా అవుతోందట. రెండు రోజుల్లో ఫంక్షన్ పెట్టుకుని టెన్షన్ పడితే చేసేదేముంది. అసలు ప్లానింగ్ నే లేనపుడు. ఫంక్షన్ విషయంలో మహేష్ సినిమాది ఇప్పటికే పై చేయి అయిపోయింది. ఇక వాళ్లదే ప్రాబ్లమ్ అని వీళ్లు, వీళ్లదే ప్రాబ్లమ్ అని వాళ్లు అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: