టాలీవుడ్ లో మెగా వారసులుగా వెండి తెరకు పరిచయం అయిన అల్లు అర్జున్..గత ఏడాది ‘నాపేరు సూర్య’ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ మూవీ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించినప్పికీ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ కావడంతో అల్లు అర్జున్ తన తదుపరి మూవీకి చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. సరైన కథ కోసం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ మంది దర్శకులను సంప్రదించినప్పటికీ సంతృప్తి చెందలేకపోయారు. చివరిగా గతంలో తనకు సూపర్ హిట్స్ అందించిన త్రివిక్రమ్ కే జై కొట్టారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ అలా వైకుంఠపురములో. ఈ మూవీ రిలీజ్ విషయంలో ఇప్పటి వరకు తర్జన భర్జనలు జరిగాయి. మొత్తానికి అలా వైకుంఠపురములో ఈ నెల 12న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే అలా వైకుంఠపురములో మూవీకి సంబంధించిన లిరిక్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.
'సామజవరగమన'... ఈ మధ్య యూత్ను ఎంతగా ఉర్రూతలూగించాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటా, బయటా ఎక్కడ చూసినా, ఎవరి నోట చూసినా ఇదే సాంగ్. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటకు ట్యూన్స్ తమన్ కంపోజ్ చేయగా సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ సంచలనంగానే సాగుతుంది. తాజాగా ఇప్పుడు ఈ పాట మరో అందమైన గొంతు తో వినిపించారు చిత్ర యూనిట్. ఈ పాటకు వచ్చిన క్రేజ్ను చూసి చిత్రబృందం దీన్ని ఫీమేల్ వాయిస్లో కూడా పాడించారు.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ శ్రేయాఘోషల్ ఈ సాంగ్ను తన అందమైన గాత్రంతో పాడుతుంటే నిజంగా మరో యూట్యూబ్ సంచలనం జరగబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా విడుదలైన ఈ వీడియోకు సైతం సూపర్ రెస్పాన్స్ వస్తున్నది. చాలా కాలం తరువాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అల వైకుంఠపురంలో సినిమా నుంచి ఫస్ట్ రిలీజైన ఈ రిలికల్ సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీలో బన్ని సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.