అప్పటి స్టార్ హీరోల్దరితో నటించిన స్టార్ హీరోయిన్ విజయశాంతి. తన ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అయితే దాదాపు 13 ఏళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు. మధ్యలో కొన్నిసార్లు సినిమాలలో నటించే అవకాశం వచ్చినా కూడా ఆవిడ పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. అందువల్ల ఏ సినిమాని అంగీకరించలేదు. దీంతో ఇక ఎప్పటికి విజయశాంతి సినిమాలలో నటించరని అందరు గట్ట్గా ఫిక్సైయ్యారు. కానీ అనూహ్యంగా మహేష్ బాబు సినిమాకి ఓకే చెప్పి షాకిచ్చారు. మొత్తానినికి 13 ఏళ్ళ తర్వాత మళ్లీ తెరపైకి వస్తున్నారు.

 

'నేటి భారతం', 'ప్రతిఘటన', 'కర్తవ్యం', 'ఒసేయ్‌ రాములమ్మ' వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన జాతీయ ఉత్తమ నటి, లేడీ అమితాబ్‌ విజయశాంతి. సూపర్‌స్టార్‌ మహేశ్‌ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో భారతి పాత్రతో అద్భుతమైన రీఎంట్రీ ఇస్తున్నారు. మహేశ్‌, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది. ఇక విజయశాంతి తప్ప ఇంకెవ్వరు ఆ పాత్రలో అంత గొప్పగా నటించలేరు అనే విధంగా విజయశాంతి భారతి పాత్రని పోషించారని చిత్ర యూనిట్‌ ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడే 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో నటించారు. మళ్ళీ ఇన్నేళ్లకు సూపర్‌స్టార్‌ మహేశ్‌ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో లేడీ అమితాబ్‌ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే కొన్ని భారీ నిర్మాణ సంస్థలు లేడీ అమితాబ్‌ విజయశాంతితో నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తాజాగా సమాచారం అందుతోంది.

 

సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ గ 'సరిలేరు నీకెవ్వరు' రూపొందుతుంది. కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది. అంతేకాదు అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో తో గట్టి పోటీకి దిగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: