సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో’ వంటి భారీ చిత్రాలు  ఉన్న విషయం తెలిసిందే.  ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి.  ఈ చిత్రాలకు సంబంధించిన టీజర్లు, పాటలు కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే సంక్రాంతి రేసులో నువ్వా-నేనా అన్నట్లు ఉన్న ఈ చిత్రాల విడుదల తేదీపై గందరగొళం ఏర్పడింది. 

 

జనవరి 11న  ముందుగా అనుకున్న ప్రకారం మహేశ్‌ సినిమా,  బన్ని చిత్రం జనవరి 12న విడుదల కావాలి. అయితే న్యూఇయర్‌ విషెస్‌ తెలుపుతూ రిలీజ్‌ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్ర పోస్టర్‌లో రిలీజ్‌ డేట్‌ కనిపించలేదు.  సోషల్‌ మీడియా వేదికగా అయితే ఈ సినిమా విడుదల తేదీని మార్చాలని నిర్మాతలు భావించారని దీంతో బన్ని మూవీ కూడా జనవరి 11నే వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. 

 

దీంతో అటు సూపర్‌ స్టార్‌.. ఇటు బన్ని అభిమానుల్లో ఆయోమయం ఏర్పడింది.  దీంతో ఈ సమస్యను  ఇరు చిత్రాల నిర్మాతలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’  , 12న అల.. వైకుంఠపురములో రిలీజ్‌ అవుతున్నట్లు ఇరు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్‌ వీడింది. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘సమస్య సాల్వ్ అయింది. ముందు అనుకున్న డేట్స్  ప్రకారమే సరిలేరు నీకెవ్వరు (జనవరి 11న), అల.. వైకుంఠపురములో (జనవరి12న) సినిమాలు వస్తున్నాయి. 

 

మరో నాలుగు సినిమాలు ఈ రెండింటితో పాటు సంక్రాంతికి వస్తున్నాయి. అన్నీ బాగా ఆడాలి’ అని దిల్‌ రాజు ఆకాంక్షించాడు. ‘అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమస్యను ప్రొడ్యూసర్స్ గిల్డ్స్‌ పరిష్కరించింది. . అందరూ కన్వీన్స్‌ అయ్యారు. హ్యపీగా వారు ముందనుకున్న ప్రకారమే ఆ రెండు సినిమాలు విడుదల కానున్నాయి’అని మరో నిర్మాత దామోదర ప్రసాద్‌ పేర్కొన్నారు.  ఇక రిలీజ్‌ తేదీపై ఏర్పడిన ఈ సమస్యకు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్స్‌లో పరిష్కారం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: