శ్రీదేవి.. అందాల తార.. అతిలోక సుందరి. సౌత్ ఇండియాకు ముద్దు బిడ్డ. బాల్యం నుండి అందరికి పరిచయం ఉన్న అద్భుత నటి. అలాంటి తార.. అర్ధాంతరంగా రెండేళ్ల కిందటా దుబాయ్ బాత్రూమ్ లో మరణించింది. ఆమె మరణం సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఆమె మరణాన్ని రామ్ గోపాల్ వర్మ లాంటివారు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. 

 

అలాంటి అద్భుత నటి మరణం ఇప్పటికి ఒక రహస్యమే.. ఒక మిస్టరీ ఏ. అప్పట్లో ఆమె మరణం ఒక సంచలనం సృష్టించింది. అలాంటి ఆమె మరణం గురించి ఇప్పుడు సంచలన నిజాలు బయట పడుతున్నాయి. ఇన్నాళ్లు ఈ సంచలన నిజాలు ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. సత్యార్థ్‌ నాయక్‌ అనే ఓ రచయిత శ్రీదేవి బయోగ్రఫీ రాసింది. ఈ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అందులో శ్రీదేవి మరణానికి కారణం ఏంటో ఆమె చెప్పారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు, సన్నిహితుల వద్ద సమాచారం సేకరించి ఆ విషయాన్నీ బయట పెట్టారు ఆ రచయత.

 

ఈ నేపథ్యంలోనే ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన సత్యార్థ్‌.. 'శ్రీదేవికి రక్తపోటు సమస్య ఉందని 'చాల్బాజ్‌' అనే దర్శకుడు పంకజ్‌ పరాషర్‌, నాగార్జున నాతో చెప్పారు. గతంలో తమతో కలిసి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో ఆమె బాత్‌రూమ్‌లో కళ్లుతిరిగి కిందపడ్డారని అన్నారు.      

 

ఆ తర్వాత శ్రీదేవి మేనకోడలు మహేశ్వరిని కలిశా. ఓసారి శ్రీదేవి బాత్‌రూమ్‌లో పడిపోయారని, ఆమె ముఖానికి గాయమై, రక్తం వచ్చిందని చెప్పారు. వాకింగ్‌లో పలుమార్లు శ్రీదేవి కుప్పకూలిపోయిందని బోనీ కపూర్‌ తెలిపారు. నేను రాసినట్లే ఆమె తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నారు' అని ఆమె అందులో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: