ఈరోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగబోతోంది. మహేష్ కు 9 సంఖ్య పై ఉండే సెంటిమెంట్ తో ఈ కార్యక్రమాన్ని సరిగ్గా 5 గంటల 4 నిముషాలకు ప్రారంభిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాబడ్డ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్న రోజున మహేష్ యాటిట్యూడ్ పై ఇండస్ట్రీ వర్గాలలో కొత్తగా ప్రచారంలోకి వచ్చిన కొన్ని విషయాలు ఇండస్ట్రీ ప్రముఖులను కూడ ఆశ్చర్య పరుస్తున్నాయి.

వాస్తవానికి మహేష్ వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాంటి మహేష్ ను ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ వివాదాలలోకి దింపింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీ డేట్ ను 12 నుండి 10కి మార్చుకుంటే తన సినిమా కూడ 10వ తారీఖునే విడుదల చేయాలి అంటూ మహేష్ పట్టుదల పట్టడం చాలామందికి షాక్ ఇచ్చింది. దీనితో దిల్ రాజ్  రాయబారలు ఫలించి ముందుగా అనుకున్నట్లు గానే ‘సరిలేరు’ డిసెంబర్ 11న ‘అల వైకుంఠటపురములో’ డిసెంబర్ 12న విడుదల అయ్యేలా చివరకు అంగీకారం  కుదిరింది. 

గతంలో చిరంజీవి మెగా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో సంక్రాంతి పండుగకు అనేక సార్లు చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఒకే రోజున విడుదల అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా తమ సినిమాలు ఒకేరోజు విడుదల అయినప్పటికీ చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ ఎప్పుడు అభ్యంతరాలు చెప్పకుండా ఆహ్వానిస్తూ వచ్చారనీ ఇప్పుడు ఒకేరోజు బన్నీతో పోటీ పడటానికి మహేష్ ఎందుకు భయపడుతూ పరోక్షంగా బన్నీ సినిమాకు తన సినిమాకు గ్యాప్ ఉండాలని ప్రయత్నించాడు అంటూ కొందరు ఇండస్ట్రీ పెద్దలు ఆశ్చర్య పడుతున్నారు.

మరి కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు అయితే మహేష్ ప్రవర్తనలో కనిపిస్తున్న ఈకొత్త మార్పు భయం అనుకోవాలా లేదంటే అతడి యాటిట్యూడ్ అనుకోవాలా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనితో మహేష్ సినిమాకు ఫంక్షన్ కు అతిధిగా వస్తున్న చిరంజీవికి కూడ ఈ విషయాలు కొంత అసౌకర్యంగా మారిందని అయితే ముందుగానే మాట ఇచ్చిన నేపధ్యంలో ఇండస్ట్రీ పెద్దగా ఈరోజు జరుగుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్ కు చిరంజీవి వస్తున్నా ఈరోజు ఈవెంట్ లో మెగా స్టార్ ఏమి మాట్లాడుతాడు అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగి పోతోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: