త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా మెగా ఫ్యామిలీతోనే సినిమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసిన మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్, బన్నీతో కూడా మూడు సినిమాలు చేశాడు. పవన్ కళ్యాణ్ తో చేసిన మూడు సినిమాల్లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే, మూడో సినిమా అజ్ఞాతవాసి బెడిసికొట్టింది. ఈ మూవీ వలన నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి.
ఇప్పుడు ఇదే భయం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కూడా పట్టుకుంది. ఎందుకంటే, అల వైకుంఠపురంలో సినిమా బన్నీతో చేస్తున్న మూడో సినిమా. ఈ సినిమా ఎలా ఉంటుంది అనే డౌట్ వచ్చింది. గతంలో బన్నీతో త్రివిక్రమ్ చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ హిట్ అందుకున్నాయి. మూడో సినిమా ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. ఎలాగైనా సరే ఈ సినిమాను కూడా హిట్ చేయాలని చూస్తున్నారు.
ఈ హిట్ తో త్రివిక్రమ్ మరోసారి టాప్ దర్శకుల సరసన చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పైగా బన్నీకి గత కొంతకాలంగా మంచి హిట్ లేదు. దీనికి ముందు చేసిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా భారీ ప్లాప్ అయ్యింది. దీంతో హిట్ కోసం చాలా కాలం వెయిట్ చేసి త్రివిక్రమ్ సినిమాను ఎంచుకున్నారు. అయితే, ఇటీవలే వచ్చిన టీజర్ చూస్తుంటే అత్తారింటికి దారేది ఛాయలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ ఆ సినిమా ఎఫెక్ట్ దీనిపై పడింది అంటే దాని వలన చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తపడుతున్నారు. పైగా మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరూ మూవీ రిలీజ్ రోజునే అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ అవుతున్నది. రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి. పోటీ కూడా అలానే ఉంటుంది. ఈ పోటీ ఉన్న తరుణంలో సినిమాను ఎలా డీల్ చేస్తారో చూడాలి. అందరి దృష్టి ఇప్పుడు త్రివిక్రమ్ మీదనే ఉన్నది. ఎందుకంటే బన్నీ ఏరికోరి త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు కాబట్టి.