చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలా తెలుగులో వచ్చిన ఒక చిత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆ రేంజ్ సినిమా కాకపోయినా, దానికి ఏమాత్రం తగ్గకుండా వచ్చిన చిత్రం ఆర్ ఎక్స్ 100. అయితే అర్జున్ రెడ్డి హీరో బేస్డ్ మూవీ అయితే ఆర్ ఎక్స్ 100 ఫీమేల్ బేస్డ్ మూవీ. ఈ సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది.

 

నటన పరంగానూ ఆమెకే ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే ఆర్ ఎక్స్ ౧౦౦ సినిమా తర్వాత దర్శకుడు అజయ్ భూపతి తన తర్వాతి చిత్రం రవితేజతో ఉంటుందని తెలిపాడు. ఆర్ ఎక్స్ 100 అనంతరం అజయ్ భూపతి తన దగ్గర ఉన్న మహాసముద్రం కథతో దాదాపు పది మంది హీరోల దగ్గరకి తిరిగాడట. అయితే అందరూ కథ బాగుందని చెప్పినవాళ్ళే కానీ ఒక్కరు కూడా డేట్స్ ఇవ్వలేకపోయారట.

 

రవితేజ మాత్రం అజయ్ తో ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పేశాడట. కానీ కొన్ని కారణాల రీత్యా రవితేజసినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు కోపంలో ఉన్న అజయ్ భూపతి తన అసహనాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్ళగక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అజయ్ భూపతి తన కథని నాగచైతన్యకి కూడా చెప్పాడట. కానీ నాగచైతన్య వద్ద డేట్స్ లేకపోవడంతో చేయలేకపోయాడట.

 

వెంటనే సినిమా మొదలు పెట్టడం కోసం అతనిప్పుడు శర్వానంద్‌ దగ్గరకు వెళ్లాడు. కథ చెప్పి శర్వానంద్‌ సమ్మతం కూడా పొందాడు. అయితే ఈ కాంబినేషన్‌లో సినిమా తీసే నిర్మాతే ఇంకా దొరకలేదు. శర్వానంద్‌ హీరో అంటే నిర్మాతలని పట్టడం అంత కష్టమేమీ కాదు. కానీ శర్వానంద్ కి ఈ మధ్య  హిట్లు పెద్దగా లేవు. మరి వీరిద్దరి కాంబినేషన్ మహాసముద్రం సినిమాని ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: