ఆ మద్య నాని, కలర్స్ స్వాతి నటించిన ‘అష్టాచమ్మా’ మూవీలో స్వాతి సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా నటించింది.  మహేష్.. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందంటూ హీరోకి కూడా అదే పేరు ఉంటేనే ప్రేమిస్తా.. పెళ్లి చేసుకుంటా అని షరతులు పెడుతుంది.  అంతగా మహేష్ ఫ్యాన్స్ ఆ పేరులోనే మాయ ఉందంటూ తెగ పొగిడేస్తుంటారు.  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో  రాజకుమారుడు సినిమాతో హీరోగా వచ్చిన మహేష్ బాబు తర్వాత కృష్ణ వంశి దర్శకత్వంలో మురారి తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.  అప్పటి వరకు డ్రీమ్ బాయ్ లో ఉన్న మహేష్ బాబు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పోకిరి’ మూవీతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.  అప్పట్లో ఈ మూవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేయడమే కాదు రికార్డులు నెలకొల్పింది. 

 

 మహేష్ బాబు వరుస విజయాలు అందుకుంటున్నారు.  ఇటీవల కొరటాల శివతో శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి.  గత ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ ఏకంగా రెండువందల కోట్ల క్లబ్ లో చేరింది.  ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.  ఇక మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సిన టాలీవుడ్ ప్రిన్స్, సాయంత్రం 4.30 గంటలకే నగరానికి చేరుకున్నారు.

 

అదే సమయంలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందన్న అంశంపై స్పష్టత రాలేదు. అయితే వర్షం తగ్గినప్పటికీ రాత్రి 10 గంటల వరకూ ప్రోగ్రామ్ మొదలయ్యే పరిస్థితి లేదని నిర్వాహకులు స్పష్టం చేసిన నేపథ్యంలో, మహేశ్ బాబు వెళ్లిపోయారు. దాంతో తమ స్టార్ హీరో మహేశ్ బాబును చూడాలని ఎంతో ఆశగా వచ్చిన అభిమానులు నిరాశచెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: