నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ను జనవరి 8న హైదరాబాద్‌లో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలుస్తోంది. ‘ఎన్టీఆర్ – బాలయ్య’ ఒకే వేదిక పై చూడాలని నందమూరి ఫ్యాన్స్ చాలీ ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. ఇక ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.

 

ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.  మ‌రి ఆర్.ఆర్.ఆర్ బిజీలో ఉన్న ఎన్టీఆర్ అన్న‌య్య కోసం రాజ‌మౌళిని ప‌ర్మిష‌న్ అడిగి మ‌రి వ‌స్తున్నాడంటే గ్రేట్ అనే చెప్పాలి. ఓ ప‌క్క ఆ చిత్ర బిజీలో ఉంటూ ఈ ఈవెంట్ కోసం రావ‌డం అంటే మాములు విష‌యం కాదు. ఇక మ‌రి బాబాయ్ అబ్బాయిలు ఇద్ద‌రూ ఈ వేదిక‌ని సంద‌డి చేయ‌నున్నార‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది. ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను బ‌ట్టి ఆయ‌న ఉండే బిజీ వ‌ల్ల బాల‌య్య ఈ ఈవెంట్‌కి రాలేక‌పోతున్నారు. అందుకు అన్న‌య్య కోసం జూనియ‌ర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. 

 

ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఒకరి సినిమా వేడుకలకు మరొకరు వెళ్లటం సర్వసాధారణం. కానీ నందమూరి ఫ్యామిలీ విషయంలో మాత్రం అలా కాదు. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఒకరి సినిమా వేడుకలో మరొకరు పాల్గొనటం ఓ అరుదైన కలయికగానే భావిస్తారు సినీ జనాలు. ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణలు ఒకే వేదిక మీద కలవటం అన్నది ఎప్పుడూ ప్రత్యేకమే.బ‌గత ఏడాది ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ఎన్టీఆర్‌ హాజరయ్యాడు. ఆ సమయంలో బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లు వేదిక మీద సందడి చేశారు. అయితే ఆ తరువాత తిరిగి ఎన్టీఆర్‌, బాలయ్యలు ఓకే వేదిక మీద కనిపించిన సందర్భం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: