ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళా ఉన్నది అన్న దానికి సరైన ఉదాహరణ మహేష్ బాబు సతీమణి నమ్రతా. ఎప్పుడూ మహేష్ బాబుకు వెన్నంటే ఉంటూ ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పెళ్లి జరిగిన  నాటి నుంచి ఇప్పటివరకూ మహేష్ కి  సపోర్టింగ్ గా నిలుస్తూ సినిమాల విషయంలో మహేష్ బాబు ఆరోగ్యం విషయంలో ఎంతో కేర్ తీసుకుంటు వచ్చింది నమ్రత . అంతేకాకుండా మహేష్ బాబు కుటుంబాన్ని మొత్తం ఎంతో శ్రద్ధగా చూసుకుంది. అటు తన పిల్లలకి కూడా మంచి తల్లిగా కూడా మారిపోయింది. వీరిద్దరి జంటను చూసినప్పుడల్లా తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడు మురిసిపోతూ ఉంటారు. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా ఎంతో ప్రేమగా కనిపిస్తూ ఉంటారు. 

 

 

 అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలను నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు అనే విషయం తెలిసిందే. తాజాగా నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నమ్రత  పెట్టిన పోస్టు వైరల్ అయిపొయింది. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణం  అయిపోయింది అంటూ మహేష్ బాబు  సతీమణి సినీ నటి నమ్రత మూడు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో  మహేష్ బాబు తండ్రి నమ్రత మామయ్య సూపర్ స్టార్ కృష్ణ... నమ్రత భర్త మహేష్ బాబు కుమారుడు గౌతం లు ఉన్నారు. నమ్రత  తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ముగ్గురూ తన జీవితంలో సూపర్ హీరో లని... నా జీవితం ఈ ముగ్గురితో పరిపూర్ణం అయిపోయింది అంటూ పేర్కొన్నారు. 

 

 

 తన  మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ గౌరవానికి కృతజ్ఞురాలిని అంటూ నమ్రత భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి ఈ ముగ్గురు తనకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తున్నారు అంటూ ఉన్నట్లు తెలిపింది. దీనికి ఎంతో సంతోషంగా ఉందని ఈ ముగ్గురే  తన బలం అని చెప్పారు నమ్రత . నమ్రత షేర్ చేసిన ఫోటోలో  కృష్ణ, మహేష్ బాబు,  గౌతమ్ తెల్ల చొక్కాలు  వేసుకుని టై  కట్టుకొని ఒకేలా ఫోజులు ఇచ్చారు. ఇకపోతే నమ్రత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: