అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జనవరి 6న చిత్రయూనిట్ భారీగా మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. 

 

ఇదిలా ఉంటే.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే అందులో ఖచ్చితంగా తెలుసుకోవలసిన జీవిత సత్యం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అసలు ఆయన కథలు దాదాపు ఆ సత్యాల నుండే పుడుతుంటాయి. అయన కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’ కథ కూడా అలా బీజం వేసుకున్నదేనట. ‘ఎవరికైనా స్థానం ఇవ్వగలమేమోకా గానీ స్థాయిని ఇవ్వలేం’ అనేదే కథా బీజం. ఈ మాటను త్రివిక్రమ్ మాటల్లో వివరిస్తే ‘సంపద, ఐశ్వర్యం వేరు వేరు. గొప్పింట్లోకి వెళితే కాసేపటికి బోర్ కొట్టేస్తుంది. 

 

అదే మధ్యతరగతి ఇంట్లో అన్నీ దొరుకుతాయి. అక్కడ సంపద ఉంటే, ఇక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈ అంశాన్నే సరదాగా చెప్పాలనుకుని ఈ కథ రాశారట ఆయన. వినడానికే గొప్పగా అనిపిస్తున్న ఈ కథ ఎలా ఉందో తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. కాగా, ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఈ చిత్రంలో సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజు, టబు, సునీల్, నవదీప్, రాజేంద్రప్రసాద్, సత్యరాజ్ త‌దిత‌రులు  ముఖ్య ప్రాత‌ల్లో న‌టిస్తున్నారు. ఇక నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: