ఉదయం నిద్రలేచినప్పటి నుండి మొదలు  రాత్రి  పడుకునే దాకా ప్రతి ఒక్కరు తమ సమయంలో  సగానికి పైగా టైమ్ ను గడిపేది చేతిలోని స్మార్ట్ ఫోన్ తోనే.వాట్సప్, ఫేస్ బుక్, యుట్యూబ్, ట్విట్టర్,బుక్ మై షో, వెబ్ సర్చింగ్, న్యూస్, గాసిప్స్, ఇంటర్నెట్ గేమ్స్…ఇలా ప్రతి సెకనూ ఇంటర్నెట్ తోనే స్నేహం చేస్తున్నామనేది అందరికీ తెలిసిన వాస్తవం. ప్రపంచం అడ్వాన్స్డ్ గా ఆలోచించి  వెళ్తున్నప్పుడు మనం కూడా అదే బాటలో పయనించడం తప్పేంకాదు

 

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన చేతి లో ఉన్నట్టే అనుకుంటాం.. మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని పట్టించుకోనప్పుడు మన చేతిలో ప్రపంచం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం.ఒకప్పుడు మన అనుకున్న వాళ్ళు దూరంగా ఉంటే ఉత్తరాలు రాసుకునే వారు.. తరువాత ఫోన్ హలో అంటూ పలకరించి ఆ దూరాన్ని దగ్గర చేసింది.. తర్వాతర్వాత ఫోన్ వాడకం పెరిగి పోయి దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేయాల్సింది పోగా దగ్గరున్న వాళ్ళని కూడా దూరం చేస్తుంది.. ప్రతి వ్యక్తి జీవితంలో ఫోన్ ఒక భాగమైపోయింది.. 

 

ప్రస్తుతం జియో పుణ్యమా అని ఫోన్ బాడీలో ఒక పార్ట్ అయిపోయింది.. దీని ఆఫర్ల మోతతో ఇతర కంపెనీలు భయపడ్డాయి.. ప్రజలు ఆనంద పడ్డారు..ఇక మిగతా కంపెనీలు కూడా ఆఫర్లు మొదలుపెట్టాయి..  అంతా నెట్ మయం అయిపోయింది.గేమ్స్, వీడియోస్, చాటింగ్ ఇలా ఫోన్ లో మునిగిపోతూ పక్కన వాళ్ళకి దూరమవుతున్నారు..

 

ఫోన్ పుణ్యమా అని మన వాళ్ళకి దూరమవ్వడమే కాదు, మనకి మనమే దూరమవుతున్నామట.. అర్ధంకాలేదా.. 24 గంటలు ఫోన్ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట.. అందుకే ఫోన్ వాడకం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.. తెలిసింది కదా.. ఫోన్ వాడకం తగ్గించండి.. మీ వాళ్ళతో ఆనందంగా గడుపుతూ, ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: