అక్కినేని నట వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అఖిల్. భారీ బడ్జెట్తో వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు అఖిల్. రెండో సినిమాగా చేసిన హలో పరవాలేదనిపించినా అఖిల్ మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేపోయింది. దీంతో రూట్ మార్చి.. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కి మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ అయింది. వాస్తవానికి అఖిల్పై ముందు నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అఖిల్ మాత్రం ఆ అంచనాలతో ఎప్పటికప్పుడు తొక్కేస్తూనే ఉన్నాడు. మరోవైపు నాగ్ కూడా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా అఖిల్ మాత్రం సక్సెస్ ట్రాక్ ఎక్కలెకపోతున్నాడు.
అయితే అటు నాగ్ తన సినిమాలు, తన షోలు చూసుకోవాలి. ఇదిలా ఉంటే చైతుకు మాత్రం అన్ని ప్లస్ పాయింట్లు ఉండడంతో మంచి జోరు మీద దూసుకుపోతున్నాడు. నిజానికి చైతు అటు ఏఎన్నార్కు, ఇటు రామానాయుడుకు మనవడు, సురేష్బాబు కూడా కొంత హెల్ఫ్ అవ్వడం, సమంత కలిసి రావడం మరియు ప్రతి సినిమా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫిస్ వద్ద హిట్లు కొడుతున్నాయి. ఇలా ప్రతిదీ కలిసొస్తుండడంతో ఇటీవల వచ్చిన వెంకీ మామ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు చైతు.
కానీ.. అఖిల్ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా నడుస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన సినిమా కూడా బాక్సాఫిస్ వద్ద చతికిల పడుతున్నాయి. కాగా, ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన నాలుగు సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అఖిల్ కెరీర్ను గాడిలో పెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. 2020 సమ్మర్ కానుకగా అఖిల్ సినిమా విడుదల కానుంది.