తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఏడేళ్లుగా జబర్ధస్త్ కామెడీ షోలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నాగబాబు ఇప్పుడు అదిరింది కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి సతమతమవుతున్నట్లు తెలుస్తుంది.  ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో ఏడేళ్లుగా జడ్జీగా వ్యవహరిస్తున్నారు.   ఇటీవల జబర్ధస్త్ కామెడీ షో నుంచి జీ తెలుగు నిర్వహిస్తున్న అదిరింది కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  అయితే ఒకప్పుడు జబర్ధస్త్ కామెడీ షో లో తమదైన కామెడీ మార్క్ చాటుకున్న వేణు, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, ఆర్ పీ ఇలా మరికొంత మంది అదిరింది కామెడీ షోలోకి వెళ్లారు. అలాగే.. జబర్దస్త్ షో నుండి ముందే బయటకు వచ్చేసిన నితిన్ భరత్‌లు అదిరింది షోని డైరెక్ట్ చేస్తున్నారు. వీరందరితో కలిసి .. జీ తెలుగులో ఆదివారం నాడు ‘అదిరింది’ షో టెలికాస్ట్ అయ్యింది.  

 

ఈ నేపధ్యంలో ఈ షోకు వచ్చిన టీఆర్పీలు ఎలా ఉండబోతోన్నాయనే విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది.  ఆ మద్య నాగబాబు వరుసగా తన సొంత యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేశారు.  ఈ నేపథ్యంలోనే ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ పోగ్రాంకు డైరక్ట్ ఛాలెంజ్ వదిలారు నాగబాబు. ఈ మేరకు ఆయన అఫీషియల్ గా ప్రకటన కూడా చేసారు.  జబర్ధస్త్ కామెడీ షో ఇక రేటింగ్ విషయంలో ఇబ్బందులు పడాల్సిందే అన్న సందేహంలో పడిపోయారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది.  

 

తాజాగా సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం మేరకు జబర్దస్త్ పోగ్రాం ఎప్పటిలాగే ఐదు నుంచి ఆరు దాకా రేటింగ్ లు తెచ్చుకుంది. అదే సమయంలో కొత్తగా ప్రారంభమైన అదిరింది పోగ్రామ్ ...0.5 రేటింగ్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. ఈ రేటింగ్ చాలా పూర్ అని చెప్పాలి. జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వంటి వారు వచ్చి పోగ్రాం చేసినా ఈ స్దాయిలో దెబ్బ కొట్టడం ఎవరూ ఊహించలేదు. కాగా, జబర్దస్త్ పోగ్రాం ఎప్పటినుంచో ఉంటోంది కాబట్టి , పోగ్రాం ఎలా ఉన్నా దానికుండే వీక్షకులు దానికి ఉంటారు. అదే అదిరింది కు మైనస్. ఇఫ్పుడే ప్రారంభమైన బిడ్డ అది. ఇంకా కొంతకాలం పోతేకానీ అదిరింది ఏ స్దాయి విజయం సాధించింది అనేది చెప్పలేం..  

మరింత సమాచారం తెలుసుకోండి: