ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. ఇక ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న నాలుగు సినిమాల తాలూకు ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ముందుగా రజినీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్ సినిమా ఈ నెల 9న రిలీజ్ కాబోతుండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న ఎంతో వైభవంగా జరిగింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఎంతో వైభవంగా జరుగనుండగా సినిమాని ఈనెల 11న రిలీజ్ చేస్తున్నారు. 

 

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమాపై కూడా బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరుగనుండగా సినిమాని 12న థియేటర్స్ లోకి తీసుకువస్తున్నారు. వీటితో పాటు కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 8న జరుగనుండగా సినిమాని 15న రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసిన ఈ నాలుగు సినిమాలు కేవలం ఆరు రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నప్పటికీ, వీటిలో హిట్ అయిన సినిమాకు మంచి కలెక్షన్స్ దక్కుతాయని చెప్పవచ్చు, 

 

అయితే దురదృష్టవశాత్తు ఫెయిల్ అయిన సినిమాకు మాత్రం కొంత దెబ్బపడనున్నట్లు తెలుస్తోంది. అదే భయం కొంచెం ఈ సినిమాల నిర్మాతలు, బయ్యర్లలో నెలకొంది. వీటి నాలుగింటిలో ఒకింత చిన్న చిత్రంగా వస్తున్న ఎంత మంచివాడవురా కనుక ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోతే కష్టం అని, అలానే రజిని దర్బార్ కూడా ఏ మాత్రం తేడాకొట్టిన ఆ ప్రభావం ఆ సినిమా కలెక్షన్స్ పై పడుతుందని, ఇక మహేష్ సరిలేరు, అల్లు అర్జున్ అలవైకుంఠపురములో సినిమాలు కూడా ఆశించిన రేంజ్ లో హిట్ కాకపోతే, నష్టం భారీగానే ఉండనున్నట్లు చెప్తున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ భీకర పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: