ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఇది కూడా నాలుగు సినిమాలు సంక్రాంతికి కానుకగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో, ఎంత మంచివాడవురా, దర్బార్ సినిమాలు ఆరు రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగా వాటిలో మన తెలుగు ప్రేక్షకుల్లో ఒకింత ఎక్కువగా దృష్టి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాల మీదనే ఉందని చెప్పాలి. ముందుగా ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో మంచి ఊపు మీదున్న మహేష్ బాబు, వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడితో సరిలేరు సినిమా చేస్తుండడంతో తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి తీరుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నారు. 

 

ఇక మరోవైపు బన్నీ, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలైన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు రెండు కూడా మంచి సక్సెస్ ని అందుకుని ఉండడంతో, ఈ సినిమా తప్పకుండా వారిద్దరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని బన్నీ ఫ్యాన్స్ ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. అలానే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, మాస్ సినిమాలను మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జక్ట్ తో తెరకెక్కించడంలో పేరుగాంచిన మురుగదాస్ దర్శకత్వంలో తెరక్కుతున్న దర్బార్ పై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రజిని మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. 

 

వీటితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా సంక్రాతి బరిలో ఉంది. ఇటీవల వరుసగా కొంత పరాజయాలు చవి చూస్తున్న కళ్యాణ్ రామ్, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అలానే గత ఏడాది తాను తీసిన శ్రీనివాస కళ్యాణం ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో దర్శకుడు సతీష్ కూడా ఈ సినిమాపై మరింతగా దృష్టిపెట్టి తీసినట్లు సమాచారం. ఇక వీటిలో ఏ సినిమా అయితే ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందో, ఆ సినిమాకు కాసుల పంట అని చెప్పాలి. మరి వీటిలో ఏ సినిమా ఎంత మేర హిట్ అందుకుంకుని సంక్రాంతి విజేతగా నిలుస్తారో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: