స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ కాంబినేషన్ లో  తెరకెక్కిన  లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో .. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా వుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. జనవరి 12న ఈచిత్రం విడుదలకానుంది. 
 
రేపు  ఈ చిత్రం యొక్క  మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్ గూడలోని  పోలీస్ గ్రౌండ్స్ లో  గ్రాండ్ గా  జరగనుంది.  ఇటీవల విడుదలైన  ప్రచార చిత్రాలు సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని  సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశాయి. దాంతో ఈ చిత్రం  అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన  చిత్రంగా రికార్డు సృష్టించింది.  ప్రపంచ వ్యాప్తంగా  ఈ సినిమా 85కోట్ల  థియేట్రికల్  బిజినెస్ చేసింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో   65కోట్ల బిజినెస్ చేయగా  ఓవర్సీస్ లో 9.5కోట్ల బిజినెస్ చేసింది.  ఇక ఈమొత్తాని  రాబట్టాలంటే  సినిమాకు  బ్లాక్ బాస్టర్ టాక్ రావాల్సిందే. 
 
అయితే ఈ సినిమాకు ఒక్క రోజు ముందు  మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు విడుదలకానుండడం తో  బాక్సాఫీస్ వద్ద అల కు గట్టి పోటీ ఎదురుకానుంది. తమన్ సంగీతం అందించిన  ఈ చిత్రంలో  పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.కాగా బన్నీ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.  ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి  సూపర్ హిట్లు  అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: