స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో .. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా వుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. జనవరి 12న ఈచిత్రం విడుదలకానుంది.
రేపు ఈ చిత్రం యొక్క మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశాయి. దాంతో ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 85కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 65కోట్ల
బిజినెస్ చేయగా ఓవర్సీస్ లో 9.5కోట్ల
బిజినెస్ చేసింది. ఇక ఈమొత్తాని రాబట్టాలంటే సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ రావాల్సిందే.
అయితే ఈ సినిమాకు ఒక్క రోజు ముందు
మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు విడుదలకానుండడం తో బాక్సాఫీస్ వద్ద అల కు గట్టి పోటీ ఎదురుకానుంది.
తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా టబు , జయరాం ,
మురళి శర్మ ,
నవదీప్ ,
సుశాంత్ ,
నివేత పేతురాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని
గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.కాగా
బన్నీ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన
జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి సూపర్ హిట్లు అయ్యాయి.