టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న... టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసింది. కాగా ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతుంది  . అంగరంగ వైభవంగా ఎల్బీ స్టేడియం వేదికగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రీ  రిలీజ్ ఈవెంట్ ప్రారంభమైంది. కాక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  అభిమానులతోపాటు... మరోవైపు మెగాస్టార్ అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. 

 

 ఇకపోతే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కాకముందే అభిమానులందరూ ఈవెంట్ జరిగే స్థలానికి చేరుకుని సందడి చేశారు. అయితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి క్రేజ్  మరింత పెరిగిపోయింది. మెగాస్టార్ సూపర్ స్టార్ కలిసి పాల్గొంటున్న ఈవెంట్ మీడియా దృష్టిని బాగా ఆకర్షించింది. ఎందుకంటే ఇప్పుడు వరకు మహేష్ బాబు ఏ సినిమా ఈవెంట్ కు  మెగాస్టార్ చిరంజీవి హాజరు కాలేదు.ఈ ఇద్దరు  స్టార్ హీరోలు ఇప్పుడు వరకు వేదిక షేర్ చేసుకున్నది  ఎక్కడా లేదు. దీంతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని అభిమానుల్లో  భారీ ఆసక్తి నెలకొంది.

 

 

 అయితే ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ అభిమానులు మరోవైపు మెగా ఫ్యాన్స్ అందరూ సందడి చేస్తుండడంతో ఎల్బీ స్టేడియం మొత్తం కోలాహలంగా మారిపోయింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలైపోయింది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్నా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లు సమాచారం. అయితే తమన్నా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే చిత్రబంధం సహా పలువురు ముఖ్య అతిథులు ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చేరుకొని సందడి చేస్తున్నారు. అటు అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబును ఒక వేదిక చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: