మహేష్బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్ బీజీ బిజీగా సాగుతుంది. భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరుసగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మహేష్, సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ బిజినెస్లోనూ దూకుడు చూపించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వందకోట్లపైగా జరిగినట్టుగా లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. మహేష్ కెరీర్లో 26వ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
ఈ మద్య సరిలేరు నీకెవ్వరు సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్గా హవా సాగిస్తూనే అడపాదడపా స్టార్ హీరోస్ మూవీస్లో ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ 'సరిలేరు నీకెవ్వరు' లో మహేష్ బాబుతో మజా చేసిందట. ఇప్పటికే విడుదలైన ఆమె ఐటెం సాంగ్ లుక్ ఆసక్తి రేపింది.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందాన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్రాజ్, రాజేంద్రప్రసాద్ లాంటి పాపులర్ ఆర్టిస్టులందరూ నటిస్తున్నారు. అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని పాటలు మరింత పెంచుతాయేమో చూడాలి.
మొత్తానికి గత ఏడాది మహర్షితో మంచి హిట్ అందుకున్న మహేష్ ఈసారి ‘సరిలేరు నీకెవ్వరు’తో మరో సెన్సేషన్ విజయం అందుకుంటాడని చిత్ర యూనిట్ అంటున్నారు. తాజాగా ఎల్బీ స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్యాన్స్ తో స్టేడియం సందడి మొదలైంది. గ్యాలరీలు అభిమానులతో నిండిపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా వస్తుండటంతో మెగా అభిమానులు కూడా ఈ ఈవెంట్కు భారీగా తరలివచ్చారు.