మన తెలుగు ప్రేక్షకుల్లో రానున్న సంక్రాంతికి  ఒకింత ఎక్కువగా దృష్టి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాల మీదనే ఉందని చెప్పాలి. ముందుగా ఇప్పటికే 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాలతో మంచి ఊపు మీదున్న మహేష్ బాబు, వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడితో సరిలేరు సినిమా చేస్తుండడంతో తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి తీరుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఆ మధ్య భారత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మహేశ్ బాబు స్వయంగా జూనియర్ ఎన్‌టి‌ఆర్ ని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ఈ సారి ఏకంగా చిరంజీవి నే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పిలిచాడు మహేశ్ బాబు .

 

మొదటి నుంచీ మెగా - సూపర్ స్టార్ ఫామిలీ ల మధ్య మంచి సఖ్యతే ఉంది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ - మహేశ్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు .. వీరిద్దరూ కలిసి టూర్ లకి కూడా వెళుతూ ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో చూస్తూనే ఉంటాం. ఆ మధ్య రామ్ చరణ్ తో మహేశ్ కొడుకు గౌతమ్ ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

 

ప్రస్తుతం మహేశ్ బాబు సరిలేరు ఫంక్షన్ కి చిరంజీవి రావడం తో అద్భుతమైన వైబ్స్ మెగా - మహేశ్ ఫాన్స్ మధ్య కనిపిస్తున్నాయి. ఇక ఫంక్షన్ లో మెగా - మహేశ్ ఫాన్స్ హడావిడి అంతా ఇంతా కాదు. మెగాస్టార్ కి గౌరవంగా సరిలేరు టీం చాలా పాటలు ప్లే చేసి డాన్స్ చేసింది .. దానికి స్టేజీ చుట్టుపక్కల ఉన్న మహేశ్ ఫాన్స్ కేరింతలు కొట్టాడమే కాకుండా మహేశ్ ఫాన్స్ డాన్సు లు కూడా చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: