నందమూరి కళ్యామ్ రామ్ కొత్త సినిమా 'ఎంత మంచివాడవురా' ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటి వరకూ పెద్దగా హైప్ నెలకొనలేదు. అయితే ఈ సినిమాపై బజ్ పెంచేందుకు నిర్మాతలు పెద్ద అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అతిథిగా తీసుకొస్తున్నారు.
అన్న కోసం తమ్ముడు.. తమ్ముడి కోసం అన్న ఎప్పుడూ అండగా ఉంటున్నారు. ఒకరి సినిమాల వేడుకలకు ఒకరు కచ్చితంగా వస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం 'ఎంత మంచివాడవురా' విడుదలకు సిద్ధం అవుతుండగా.. దాని ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా తారకే వస్తాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం నిజమే అని తేలింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 8 వ తేదీన హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారని కూడా వెల్లడించారు. ఈ పోస్టర్ లో ఎడమ వైపు ఎన్టీఆర్ ఫోటో.. కుడివైపు కళ్యాణ్ రామ్ ఫోటో ఉంది.
సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' హంగామా మధ్య కళ్యాణ్ రామ్ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అత్యవసరంగా దీనికి బజ్ పెంచాల్సిన అవసరం ఉంది. తారక్ వచ్చాడంటే ఆటోమేటిగ్గా జనాల దృష్టి దాని మీదికి మళ్లుతుందని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మేహరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త కలిసి నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు