సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బి స్టేడియం లో జరుగుతుంది. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. సుమ యాంకరింగ్ తో మొదలైన ఈ ఈవెంట్ లో కరెక్టుగ 7 అవగానే 7'0 క్లాక్ పంచ్ వేసింది. సినిమాలో స్పెషల్ రోల్ చేసిన బండ్ల గణేష్ ను ఆహ్వానిస్తూ 7' క్లాక్ అయ్యిందంటే ఒకరితో మాట్లాడించాలంటూ బండ్ల గణేష్ ను స్టేజ్ మీదకు పిలిచింది సుమ. 7' క్లాక్ కాగానే బండ్ల గణేష్ నే ఎందుకు పిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

సుమ వేసిన పంచ్ కు స్టేడియం అంతా చప్పట్లతో మోగిపోయింది.. ఇక మైక్ అందుకున్న బండ్ల గణేష్ఈవెంట్ లో నన్ను నేను ప్రమోట్ చేసుకుంటా అని అన్నారు. సినిమాలో తనది గమ్మత్తైన వేషమని.. 30 ఏళ్లుగా సినిమా పరిశ్రమలోనే ఉన్నా.. ఇక నుండి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నా వరుస సినిమాలు చేస్తానని అన్నారు బండ్ల గణేష్. అంతేకాదు 7'ఒ క్లాక్ లు పక్కన పెట్టి ఎంటర్టైన్ చేయడమే పనిగా పెట్టుకుంటానని అన్నారు బండ్ల గణేష్. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గురించి స్పెషల్ గా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తైన మెగాసటార్ ఈఈవెంట్ కు గెస్ట్ గా రావడం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని బండ్ల గణేష్ అన్నారు.  

 

ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన అనీల్ రావిపుడికి, నిర్మాతలు అనీల్, దిల్ రాజులకు థ్యాంక్స్ చెప్పాడు బండ్ల గణేష్. ఇక మీదట సినిమాలే జీవితంగా బ్రతకాలని నిర్ణయించుకున్నా అని అన్నారు బండ్ల గణేష్. ఇక గణేష్ అలా మాట్లాడి మైక్ ఇచ్చి వెళ్తుండగా అనుకున్న టైం కు అనుకున్నది జరిగితే హాయిగా ఉంటుందని మరోసారి సుమ బండ్ల గణేష్ మీద పంచ్ వేసింది. పటాస్ నుండి ఎఫ్ 2 వరకు తీసిన ప్రతి సినిమా హిట్ అందుకున్న డైరక్టర్ అనీల్ రావిపుడి మహేష్ తో కూడా పక్కాగా హిట్ కొట్టేలా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: