జబర్దస్త్ షో ఎంతో మందికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ఫేమ్‌తోనే సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది లాంటి వాళ్లు మంచి క్రేజ్ కూడా సంపాదించుకున్నారు.  ఇక ప్ర‌స్తుతం జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం. హైపర్ ఆది అంటే పంచులు వేయడంలో మహా ఎక్స్ పర్ట్ అనే చెప్పవచ్చు. కానీ ఒక్కోసారి ఆ పంచులు మిస్ ఫైర్ అవుతుంటాయి. దీంతో వివాదాలు ముసురుకొస్తుంటాయి. అయితే తాజాగా ఆడవారి పార్టీలు అర్థాలే వేరులే ప్రోగ్రాంలో హైపర్ ఆది వేసిన పంచులకు వీపు పగిలిపోయింది. 

 

వర్షిణితో కలిసి రోజా కొత్త సంవత్సరంలో తనకు కేవలం 20 సంవత్సరాలు వస్తాయని జోక్ చేస్తే...హైపర్ ఆది మధ్యలో కల్పించుకొని ఇద్దరికీ రెండు సంవత్సరాల తర్వాత షష్టి పూర్తి అవుతుందని ఆ తర్వాత తాను వస్తానని పంచ్ వేశాడు. దీంతో సీరియస్ అయిన రోజా పక్కనే ఉన్న హైపర్ ఆది వీపు విమానం మోత ఎక్కించింది. దీంతో హైపర్ ఆది ఖంగుతిన్నాడు. అంతేకాదు షో కేవలం కిట్టీ పార్టీ లాంటిదని అదేమీ, పొలిటికల్ పార్టీ కాదని చెప్పేశాడు. ఇలా హైపర్ ఆది కొత్త సంవత్సరం స్పెషల్ ప్రోగ్రామ్ లో రోజాపై పంచ్‌లు వేస్తూ రెచ్చిపోయాడ‌ని చెప్పాలి.

 

అంతేనా.. ఈ ప్రోగ్రామ్‌లోనే ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు కొత్త సంవత్సరంలో మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశ ఉందని పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చేశాడు. ఇలా త‌న స్కిట్స్ కోసం రోజాపై పంచ్‌లు వేసుకుంటూ వెళ్లిపోతున్నాడు ఆది. కాగా, ఈ మధ్యే యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆది త్వ‌ర‌లోనే హీరో కాబోతున్న‌ట్టు తెలిపారు. ఇప్పటికే కథలు వింటున్నానని.. తనకు డాన్సులు, ఫైట్లు అస్సలు పడవని.. పూర్తిగా కామెడీ ప్రధానంగా సాగే కథను ఎంచుకుంటానని చెప్పాడు హైపర్ ఆది. సుధీర్ డాన్సులు, ఫైట్లు చేస్తేనే చూడలేదు.. మరి ఈయన ఏం లేకుండా జస్ట్ కామెడీతో వస్తానంటున్నాడు ఆది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: