సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ఈ సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ వేడుకకు వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. దీంతో ఈ మూవీపై ప్యాన్స్ లో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇటు సూపర్ స్టార్ మహేశ్...అటు...మెగాస్టార్ చిరంజీవి అగ్ర హీరోలు ఇద్దరూ ఒకే వేదికను షేర్ చేసుకుంటుండటంతో ఎల్బీ స్టేడియానికి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ క్యూ కట్టారు. తమ అభిమాన హీరోలను ఒకే దగ్గర చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ ఈవెంట్కి అతిధిగా విచ్చేసిన బండ్ల గణేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..సూపర్స్టార్ మహేష్బాబు సరిలేరునీకెవ్వరు చిత్రం. ఈ సంక్రాంతికి అదే జరగబోతుంది. సరిలేరు మహేష్బాబుకి ఎవ్వరు అన్నట్లు అని అన్నారు. మనసున్న మనిషి మెగాస్టార్ అతిధిగా రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఎవరెస్ట్ సిఖరమంత ఎత్తైన మెగాస్టార్గారు తొలిసారి సూపర్సట్ఆర్ మహేష్బాబు ప్రీరిలీజ్ ఈవెంట్కి రావడంతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
నేటి సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగుతున్న 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి జనం పోటెత్తడం ఖాయం. ఈ మేరకు వాహనదారులు, ప్రజలపై పోలీసులు ఆంక్షలను విధించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు వైపు నుంచి వచ్చేవాహనాలను నాంపల్లివైపు మళ్లిస్తామని, అదేవిధంగా ఆబిడ్స్ నుంచి వచ్చే వాహనాలను గన్ ఫౌండ్రీ మీదుగా మళ్లిస్తామని, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనదారులు బషీర్ బాగ్ మీదుగా హిమాయత్ నగర్ వైపు వెళ్లాలని సూచించారు పోలీసులు.