టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు పై ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎల్‌బి స్టేడియం లో చాలా అట్టహాసంగా జరిగింది.

 

ఈ వేడుక కి ఇండస్ట్రి పెద్దలు అందరూ విచ్చేశారు .. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిరు - మహేశ్ ఒకే స్టేజీ మీద కనపడ్డం తో మెగా సూపర్ ఈవెంట్ అనే పేరు సార్ధకం అయినట్టు గా అయ్యింది .. ప్రతీ ఒక్క మహేశ్ - మెగా అభిమాని పండగ చేసుకునేలా ఈ ఈవెంట్ నడిచింది. ట్రయిలర్ లాంచ్ దగ్గర నుంచీ ప్రతీ విషయాన్ని శ్రీయస్ సంస్థ వారు చాలా జాగ్రత్తగా దగ్గరుండి ప్లాన్ చేసుకున్నారు.

 

మెగాస్టార్ ఎంట్రీ కావచ్చు, మహేశ్ స్పీచ్ అప్పుడు ఫాన్స్ ప్లాన్ చేసిన సైలెన్స్ కావచ్చు ఇలా యావత్ ఇండస్ట్రి అబ్బురపడేలా ఈ ఈవెంట్ సాగింది అనే చెప్పాలి. మహేశ్ గురించి ప్రతీ ఒక్కరూ తమ పరిధి లో చెప్పుకొచ్చారు .. ఈ ఫంక్షన్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ కష్టపడే మనుషుల గురించి మాట్లాడితే మొదట గుర్తుకు వచ్చేది చిరంజీవి అనీ .. ఆయన అంతా గొప్ప స్టార్ అవడం వెనక ఉన్నది ఆ కష్టమే అని చెప్పుకొచ్చారు .. దిల్ రాజు కి కూడా పంచ్ లు వేసిన సుధీర్ బాబు తన తో కూడా సినిమా తీయమని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: