టాలీవుడ్ లో భరత్ అనే నేను, మహర్షి మూవీతో సూపర్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీలో దాదాపు పదిహేనేళ్ల తర్వతా లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.  ఇక రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మరోసారి మంత్ర ముగ్దులను చేశారు.  తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.   స్టేడియం బయట అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు.  ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్న విషయం తెలిసిందే.  దాంతో స్టేడియంలో మెగా, మహేష్ ఫ్యాన్స్ తో సందడీ మొదలైంది.  

 

అయితే, మహేష్ బాబు సినిమా ఈవెంట్‌కు మెగాస్టార్ రావడం ఇదే తొలిసారి. కాబట్టి, సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ వేడుకలో చిరు గురించి మహేష్ ఏం  ఏం మాట్లాడతారు.. మహేష్ గురించి చిరు ఏం చెబుతారు అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను రెట్టింపు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవిని చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా తీసుకొస్తున్నారు. 

 

మరోవైపు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. నైజాం హక్కులు 25 కోట్లకు అమ్ముడవ్వగా సీడెడ్ 12 కోట్లు, నెల్లూరు 3.2 కోట్లు, కృష్ణ 6.3 కోట్లు, గుంటూరు 7.5 కోట్లు, వైజాగ్‌ 9.6 కోట్లు, ఈస్ట్ గోదావరి 7.5 కోట్లు, వెస్ట్ గోదావరి 5.5 కోట్లు ధర పలికినట్టుగా తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 76.7 కోట్ల బిజినెస్‌ చేసింది. ఇక కర్ణాటక 8.3 కోట్లు, ఇరత రాష్ట్రాలు 1.8 కోట్లు, ఓవర్‌ సీస్‌ 13.6 కోట్లు కలుపుకుంటే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ బిజినెస్‌ 100.3 కోట్లకు చేరింది.  మొత్తానిక సంక్రాంతి పండుగకు మెగా, మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: