ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర టాప్ హీరోల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు రజినీకాంత్ నటించిన మూడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్ననాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు ‘సరిలేరు…’ వర్సెస్ ‘అల వైకుంఠపురం లో’ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రెండు సినిమాల విడుదల తేదీ విషయంలో ఇద్దరు హీరోలు వెనక్కి తగ్గకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘సరిలేరు…’ వర్సెస్ ‘అల వైకుంఠపురం లో’ విడుదల తేదీ పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటువంటి వాతావరణం నెలకొనడంతో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కూడా ఇదే సమయానికి రిలీజ్ అవుతున్న తరుణంలో ఇద్దరు స్టార్ హీరోలను రజిని బీట్ చేయగలడా..? అని ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన గత సినిమాలు దారుణంగా ఫ్లాప్ కావడంతో ‘దర్బార్’ సినిమాతో సూపర్ హిట్ కొడతాడో లేదో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

 

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దర్బార్’ ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు సినిమాల తాకిడిని రజినీకాంత్ తట్టుకోగలడా ఇదివరకు ఉన్నంత ఫాలోయింగ్ ప్రస్తుతం రజనీకాంత్ కి లేకపోవడంతో గత కొన్ని రోజుల నుండి చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవడంతో ఇదే తరుణంలో రజినీకాంత్ తమిళ రాజకీయాల్లోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో అసలు రజనీకాంత్ సినిమాలు తెలుగు వాళ్ళు పట్టించుకుంటారా లేదా అన్న టెన్షన్ 'దర్బార్' సినిమా యూనిట్ కి ఉన్నట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరు నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: