2020 సంవత్సరం సంక్రాంతి పండుగకు రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అల వైకుంఠపురములో కాగా మరొకటి మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సరిలేరు నీకెవ్వరు సినిమా. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాలను ఆకర్షిస్తున్నాయి. 
 
మహేష్ బాబుకు అటు క్లాస్ లో ఇటు మాస్ లో అభిమానులు ఉన్నారు. అనిల్ రావిపూడి క్లాస్ టచ్ తో కూడిన మాస్ సినిమాలు తీస్తాడు కాబట్టి అనిల్ రావిపూడిపై సినిమాలంటే అటు మాస్, ఇటు క్లాస్ అభిమానులు ఆసక్తి చూపిస్తారు. బన్నీకు కూడా క్లాస్, మాస్ అభిమానులు ఉన్నా త్రివిక్రమ్ ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలే తీస్తాడనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది. కానీ త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ తరువాత అరవింద సమేత లాంటి మాస్ సినిమాను తీశారు. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీయార్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అల వైకుంఠపురములో సినిమా కూడా త్రివిక్రమ్ క్లాస్, మాస్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించాడని సమాచారం. ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా నుండి విడుదలైన రాములో రాములా పాట మాస్, క్లాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. 
 
మరి ఈ రెండు సినిమాలు క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో మాస్, క్లాస్ ప్రేక్షకులు ఎవరు ఏ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో చూడాలి. సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11వ తేదీన విడుదల కానుండగా అల వైకుంఠపురములో సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. దాదాపు 200 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమాలు మహేష్ బాబు, అల్లు అర్జున్ కెరీర్లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: