సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా తారా స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి కొన్నేళ్ల విరామం తరువాత తెలుగు సినిమా పరిశ్రమకు నటిగా రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. 

 

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఐదు సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ఎంతో అదరగొట్టడం జరిగింది. ఇకపోతే నేడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి తన చేతులమీదుగా కాసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే సినిమా పై అంచనాలు మరింత విపరీతంగా పెరిగాయని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ట్రైలర్ లో ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, డాన్స్ మూమెంట్స్ వంటివి ఎంతో బాగున్నాయి. ఇక మహేష్ బాబు ప్రత్యేకంగా పలికిన మ్యానరిజమ్ డైలాగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. అలానే విజయశాంతి సీన్స్ తో పాటు హీరోయిన్ రష్మిక కామెడీ సీన్స్ కూడా ఎంతో బాగున్నాయి. 

 

కాగా ఈ ట్రైలర్ ప్రస్తుతం అత్యధిక వ్యూస్, తో పాటు లైక్స్ తో కూడా అదరగొడుతూ దూసుకుపోతోంది. దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకరలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని నిర్మిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని, తమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తోంది సినిమా యూనిట్. మరి ఈ సినిమా ఎంతమేరకు సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మరొక్క వారం ఓపికపట్టాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: