‘సరిలేరి నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో రష్మిక మందన్నా.. మెగాస్టార్ చిరంజీవికి పబ్లిక్‌గానే బిస్కెట్ వేసింది. అది కూడా  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ.. నాకు మెగాస్టార్ చిరంజీవి లక్కీ అని ఈ సందర్భంగా ప్రస్తావించింది. రష్మిక మందన్న తొలిసారి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ‘ఛలో’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచిందని ఈ సందర్భంగా రష్మిక మాట్లాడింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతా గోవిందం’ సినిమా కూడా చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ సినిమా కూడా సక్సెస్ సాధించింది. ఇపుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు కూడా మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని రష్మిక మందన్న స్టేజ్ పై చిరంజీవిని పొగడ్తతలో  ఓ రేంజ్‌లో ముంచెత్తింది. అంతకు ముందు ఈవెంట్‌కు లేట్‌గా హాజరైన రష్మిక మందన్న .. చిరంజీవి ఆశీర్వాదం తీసుకోవ‌డం కోసం ఒక్క‌సారిగా అంద‌రిలో ఆయ‌న‌కు మ‌హేష్‌కు మ‌ధ్య కాళ్ళ ద‌గ్గ‌ర కూర్చుని ఎంతో అభిమానంగా మాట్లాడింది. 

 

ఈ రోజుల్లో హీరోయిన్లు ఎంతో గ‌ర్వంగా ఉంటున్నారు. అలాంటిది ఒక టాప్ రేంజ్‌లోకి వ‌చ్చాక కూడా ఇంత మంచి  గౌర‌వంతో సీనియ‌ర్ల‌కు ఇంత విలువిచ్చే హీరోయిన్లు చాలా త‌క్కువ‌. ఒక‌ర‌కంగా ప్ర‌జంట్ జ‌న‌రేష‌న్‌లో ఎవ్వ‌రూలేర‌నే చెప్పాలి. ర‌ష్మిక ఇటు మ‌హేష్‌కి, అటు చిరుకి ఎంతో గౌర‌వం ఇచ్చింద‌నే చెప్పాలి. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చాలా మంది పాల్గొన్నారు. మ‌హేష్ గ‌త చిత్రాల ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు చాలా మంది పాల్గొన్నారు. కొర‌టాల‌శివ‌, వంశీపైడిప‌ల్లి, గోపిఅచంట‌, బెక్కంవేణుగోపాల్‌, ఫైట్‌మాస్ట‌ర్ రామ్‌ల‌క్ష్మ‌ణ్‌, ఇలా ఎంతో మంది అతిర‌ధ మ‌హార‌ధులు పాల్గొన్నారు. ర‌ష్మిక ఈ చిత్రంలో అర్ధ‌మ‌వుతుందా... అంటూ అనిల్ రావిపూడి సినిమాలో ఎప్పుడూ ఉండే ఒక హైలెట్  డైలాగ్ ర‌ష్మికాది అదే. అర్ధ‌మ‌వుతుందా ... అంటూ ర‌ష్మిక ఆడియ‌న్స్‌ని అల‌రిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: