తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ అంటే సినిమాల సీజన్‌. ఒకసారి రెండు పెద్ద సినిమాలు విడుదల చేయడానికే నిర్మాతలు భయపడుతుంటారు. అలాంటిది ఈ ఏడాది ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా నాలుగు సినిమాలు ఈసారి సంక్రాంతి బరిలో నిలిచాయి. ఒకరు సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ రజనీ, మరొకరు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, ఇంకొకరు స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ మ‌రియు నందమూరి నటవారసుడు కల్యాణ్‌రామ్‌. ఈ నలుగురు సంక్రాంతి పండగకు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయారు. ఈ చతుర్ముఖ పోటీని అభిమానులు పండగ చేసుకుంటుండగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సినిమాల రిజ‌ల్డ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఇవాళ హైదరబాద్ లో అట్టహాసం గా జరిగిన సరిలేరు నీకేవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయం లో చిరంజీవి - మహేశ్ బాబు ఇద్దరూ కలిసి స్టేజీ ఎక్కుతుంటే జనాల రెస్పాన్స్ అంబరాన్ని అంటింది. మెగాస్టార్ ని, మెగా ఫామిలీ ని ఇష్టపడే ప్రతీ ఒక్కరూ దాదాపు గా మహేశ్ బాబు ని ఇష్టపడుతూనే ఉంటారు .. మహేశ్ - పవన్ కల్యాణ్ ల మధ్య కూడా ఎప్పుడూ ఒక మంచి అనుబంధం ఉంటుంది.

 

మహేశ్ అర్జున్ సినిమా సీడీల వ్యవహారం కావచ్చు మరేదైనా కావచ్చు పవన్ హెల్ప్ మహేశ్ , మహేశ్ సపోర్ట్ పవన్ తీసుకుంటూనే ఉంటారు .. ఇక రామ్ చరణ్ ఫామిలీ, మహేశ్ ఫామిలీ అయితే టూర్ లు కూడా వేస్తూ ఉంటారు .. ఈ పరిస్తితి లో మహేశ్ బాబు మెగా సూపర్ ఈవెంట్ ని ప్లాన్ చెయ్యడం అందరికీ ఫుల్ ఖుషీ అనిపించింది. సరిగ్గా స్టేజీ ఎక్కడానికి మెగాస్టార్ ని ఆహ్వానించిన టైమ్ లో మహేశ్ స్వయంగా వెళ్ళి చిరు ని స్టేజీ మీదకి తీసుకుని రావడం తో ఇద్దరు హీరోల అభిమానులకీ కన్నుల పండగ లాగా అయ్యింది పరిస్తితి .

మరింత సమాచారం తెలుసుకోండి: