సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఎంతో వైభవంగా జరిగింది. సినిమా యూనిట్ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి

 

లేడీ సూపర్ స్టార్ విజయశాంతిల మధ్య జరిగిన ఒక సంభాషణ ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాలతో పాటు మీడియా మాధ్యమాల్లో కూడా ఎంతో వైరల్ అవుతోంది. ముందుగా చిరంజీవిసినిమా గురించి మాట్లాడుతూ, తనకు మహేష్ బాబు అంటే ప్రత్యేకమైన అభిమానమని, అలానే మహేష్ ని చూస్తుంటే తన సొంత బిడ్డను చూసిన ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. ఇక తనతో కలిసి 20 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా పనిచేసిన విజయశాంతిని ఎన్నో ఏళ్ల తరువాత ఈ విధంగా స్టేజ్ పై కలుస్తున్నానని అన్నారు. ఇక ఫంక్షన్ చివర్లో ఒక మాట చెప్పాలి అంటూ విజయశాంతిని దగ్గరకు పిలిచి మాట్లాడిన మెగాస్టార్, కొన్నేళ్ల క్రితం తమ ఇంటికి ఎదురుగానే విజయశాంతి ఉండేవారని, ఎంతో కలుపుగోలుగా ఉండే ఆమె, 

 

ఒక్కసారిగా రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత తనపై చేసిన కామెంట్స్ తనను కొంత బాధించినప్పటికీ కూడా తాను మాత్రం ఎప్పుడూ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదని అన్నారు. అయితే వెంటనే ఆయన మాటలకు రియాక్ట్ అయిన విజయశాంతి, మీరు నా ఎదురుగా, లేదా మీడియాకి ఎదురుగా కామెంట్స్ చేసి ఉండకపోవచ్చు, కానీ వెనుక నుండి నన్ను తిట్టుకుని ఉండవచ్చు కదా ని అన్నారు. అయితే ఆమె మాటలకు రియాక్ట్ అయిన చిరు, తాను ముందు నుండే ఏమి అనలేనపుడు, ఇంక వెనుక నుండి ఏమి అనగలనని అన్నారు. కాగా వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: