సూపర్ స్టార్ మహేష్ బాబు, మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు నుండి ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ అయి, ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలు పెంచగా, ఇక నిన్న రాత్రి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్, వాటిని మరింతగా డబుల్ చేసింది అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న రాత్రి హైదరాబాద్ లో నిర్వహించింది సినిమా యూనిట్. ఈ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా విచ్చేసి, సినిమాపై అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు పై పొగడ్తలు కురిపించారు. 

 

తనకు మహేష్ బాబు కూడా ఒక బిడ్డ వంటివాడని, తనకు మంచి హిట్ సినిమా వచ్చినపుడు నేను ఎంతో ఆనందపడతానని అన్నారు. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తనకు ఆహ్వానించగానే వెంట సరే అని చెప్పానని మెగాస్టార్ అన్నారు. ఇక నేటి దర్శకులు సినిమాలను ఎంతో లేట్ గా తీస్తున్నారని, అదే ఒకప్పటి కాలంలో అయితే సినిమాలు ఎంతో వేగంగా సినిమాలు తీసేవారని అన్నారు.అయితే ప్రస్తుతం కొందరు డైరెక్టర్లు మాత్రం, తమ సినిమాలను చకచకా తీసేలా ప్లాన్ చేస్తున్నారని, ఆ విధంగా చూసుకుంటే ఈ సరిలేరు సినిమాని కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసిన దర్శకుడు అనిల్ ఎంతో అబినందనీయుడని మెగాస్టార్ అన్నారు. 

 

ఆ తరువాత తన తదుపరి సినిమా దర్శకుడైన కొరటాలను దగ్గరకు పిలిచిన మెగాస్టార్, మీరు కూడా నా సినిమాను వీలైనంత వేగంగా తీయాలి, ఇదివరకు నాకు మాట ఇచ్చిన విధంగా కేవలం 100 రోజుల్లోపే, అనగా 99వ రోజుకల్లా సినిమా పూర్తి అయి తీరాలి అంటూ కొంత సరదాగా కొరటాల శివను ఉద్దేశించి చిన్నవార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ని, సాంగ్స్ ని బట్టి చూస్తుంటే రేపు రిలీజ్ తరువాత సినిమా తప్పకుండా హిట్ కొట్టడం ఖాయం అని, హీరో మహేష్ బాబుకు, దర్శకుడు అనిల్ కు, అలానే నిర్మాతలకు తన తరపున ముందుగానే అభినందనలు తెలుపుతున్నానని మెగాస్టార్ అన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: