సెంటిమెంటే ప్రధాన భూమిక పోషించే సినీ ఇండస్ట్రీలో ఒకొక్కరికి ఒకో సెంటిమెంట్ ఉంటుంది. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే సినిమాల్లో సెంటిమెంట్ లేకుండా ఉండదు. ఇక హీరో, హీరోయిన్లు  హిట్ కోసం పలు సెంటిమెంట్లు ఫాలో అవుతూంటారు. ఇందులో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక కూడా ఉంది. మహేశ్ హీరోగా.. తాను హీరోయిన్ గా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మెగాస్టార్ చిరంజీవిని తన లక్కీ చార్మ్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

 

 

అంగరంగ వైభవంగా జరిగిన వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై ఫంక్షన్ కు కొత్త వెలుగు తీసుకొచ్చారు. రష్మిక చెప్పిన లక్కీ చార్మ్ మాత్రమే కాకుండా ఈ ఫంక్షన్లో మరికొన్ని హైలైట్స్, లక్కీ చార్మ్ లు ఉన్నాయనే చెప్పాలి. ఫంక్షన్ జరిగిన రోజే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజుకు మనవరాలు పుట్టడం యాదృచ్ఛికమనే చెప్పాలి. అలానే దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా నిన్నటి ఉదయం కొడుకు పుట్టడం కూడా యాదృచ్ఛికమనే చెప్పాలి. ఇంకా.. విజయశాంతి తను హీరోయిన్ కృష్ణతో నటిస్తే తన కమ్ బ్యాక్ మూవీ ఆయన తనయుడు మహేశ్ తో చేయడం కూడా లక్కీ చార్మ్ అనే చెప్పాలి.

 

 

అన్నిటికంటే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎన్నో ఏళ్ల తర్వాత ఒకే స్టేజ్ పై కలుసుకోవడం అక్కడి అభిమానులనే కాకుండా సినీ అభిమానులకు కూడా కనువిందు చేసిందనే చెప్పాలి. మహేశ్ నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన ప్రదేశంలోనే ఈ సినిమా ఫంక్షన్ జరగడం లక్కీనే. మరి రష్మిక చెప్పిన మాటలు, మిగిలిన ఉదాహరణలు నిజమవుతాయో లేదో చూడాలంటే జనవరి 11 రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: