హైదరాబాద్ వేదికగా ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరాన్ని దద్దరిల్లే విధంగా చేసింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రావటంతో మెగా అభిమానులు మరియు సూపర్ స్టార్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోటెత్తారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే స్థలంలో జరగటంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అదే స్థాయిలో విజయం సాధించాలని ఈ వేడుకకు హాజరైన డైరెక్టర్ కొరటాల శివ కోరుకున్నారు.

 

మహేష్ బాబు మరియు విజయశాంతి స్పీచ్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉండగా అందరికంటే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన ప్రసంగం సినిమా గురించి చెప్పిన విశేషాలు ముఖ్యంగా మహేష్ బాబు గురించి మహేష్ యొక్క అందం గురించి తెగ పొగడ్తల వర్షం కురిపించారు. చివరిలో చిరంజీవి దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసావు అంటూ విజయశాంతి గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన తీరు అక్కడ ఉన్న వాళ్లనే వేదిక పైన ఉన్న వాళ్ళని నవ్వులు పువ్వులు పూయించాయి. అయితే సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వటం గ్యారెంటీ అని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు.

 

విడుదలైన ట్రైలర్ లో విజయశాంతిని చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించడం జరిగింది అంతేకాకుండా మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ చాలా సరికొత్తగా ఎనర్జిటిక్ గా అనిల్ రావిపూడి చూపించినట్లు ముఖ్యంగా సినిమాలో ట్రైన్ కామెడీ సినిమాకే హైలెట్ అన్నట్లు చూసి చాలామంది అభిమానులు మరియు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చాలా సరికొత్తగా మహేష్ బాబు సినిమాలో కామెడీ చేసినట్లు చాలామంది సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పటం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు సినిమా కొత్త ట్రెండ్ ఇండస్ట్రీలో సృష్టించడం గ్యారెంటీ అని సినిమా యూనిట్ కి చెందిన వాళ్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: