యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ ప్లానింగ్ ని ఇండస్ట్రీ జనాలు మెచ్చుకుంటున్నారు. ఎక్స్ పీరియన్స్ కంటే ప్లానింగ్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈ క్రేజీ డైరెక్టర్ నిరూపించాడు. పెద్ద దర్శకులకు కూడా సాధ్యం కానిదాన్ని అనిల్ రావిపూడి షార్ట్ టైమ్ లో చేసి చూపించాడు. 

 

గతేడాది ఎఫ్ 2 ఇండస్ట్రీ హిట్ తో దర్శకుడిగా అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ తో ఏకంగా మహేశ్ బాబును డైరెక్షన్ చేసే ఛాన్స్ పట్టేశాడు. ఫ్లాప్ అనేది లేకుండా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి టైమింగ్ ఇండస్ట్రీకి జనాలను ఆకట్టుకుంది. మహేశ్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాను అనుకున్న టైమ్ కంటే ముందే ఫినిష్ చేయడంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 

 

మహేశ్ బాబుతో సినిమా కంటే కనీసం ఏడాది సమయం పడుతోంది. కానీ అనిల్ రావిపూడి మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాను కేవలం ఐదు నెలల్లో సినిమాను రిలీజ్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. జులై 5న మొదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా ఐదు నెలల్లో పూర్తవ్వడానికి అనిల్ రావిపూడి పర్ ఫెక్ట్ ప్లానింగ్ కారణమంటూ సినీ జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్ బాబు, విజయశాంతి, ప్రకాశ్ రాజ్ లాంటి భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఈ యంగ్ డైరెక్టర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాను ఇన్ టైమ్ లో కంప్రీట్ చేయడం ఆసక్తిగా మారింది. 

 

సరిలేరు నీకెవ్వరు సినిమాకంటే మూడు నెలల ముందు అల వైకుంఠపురంలో షూటింగ్ మొదలైంది. అయినప్పటికీ ఈ చిత్రం పూర్తవ్వడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది. నిజానికి సరిలేరు నీకెవ్వరుతో పోలిస్తే అల వైకుంఠపురములో అవుట్ డోర్ షూటింగ్ కూడా పెద్దగా లేదు. సాంగ్స్ కోసం మాత్రమే పారిస్ వెళ్లారు. సరిలేరు నీకెవ్వరు కాశ్మీర్ లో కొంత భాగాన్ని షూట్ చేసుకొచ్చారు. ఏదేమైనా త్రివిక్రమ్ ఎక్స్ పీరియన్స్ కంటే అనిల్ రావిపూడి ప్లానింగ్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: