డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగా కాంపౌండ్ ని వదలడం లేదు. ఈ స్టైలీష్ డైరెక్టర్ మరోసారి మెగా హీరోతోనే మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. మాస్ హిట్ కొట్టిన మెగా ప్రిన్స్ తో సురేందర్ రెడ్డి యాక్షన్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. 

 

సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి మరో సినిమాను స్టార్ట్ చేయలేదు. ఆ మధ్య ప్రభాస్ తో సినిమా చేస్తాడని ప్రచారం సాగినా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. సూరి దగ్గర స్క్రిప్ట్ లు సిద్ధంగా ఉన్నా స్టార్ హీరోలు ఖాళీ లేకపోవడంతో ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. పైగా సైరా తర్వాత డైరెక్ట్ చేసే సినిమా ప్రతిష్టాత్మకంగా ఉండాలని ఈ డైరెక్టర్ భావిస్తున్నాడట. అందుకే మరోసారి మెగా కాంపౌంట్ లో హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా చేయాలని సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

 

వరుణ్ తేజ్ కోసం సురేందర్ రెడ్డి అదిరిపోయే యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. అంతేకాదు ఈ సినిమాను సురేందర్ రెడ్డి స్వయంగా నిర్మించనున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ మీదున్న నమ్మకంతోనే దర్శకత్వంతో పాటు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డికి సపోర్ట్ గా మరో నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా ఈ సినిమాలో భాగం కానున్నాడట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు తెర వెనుక చకచక సాగుతున్నట్టు వినికిడి. 

 

ప్రస్తుతం వరుణ్ తేజ్ డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్, సురేందర్ రెడ్డి మూవీ పట్టాలెక్కుతోందని టాక్. ఈ లోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ని మరోసారి చెక్ చేసుకోనున్నాడట. ఇప్పటికే ఈ దర్శకుడు కాంపౌండ్ లో అల్లుఅర్జున్, రామ్ చరణ్, చిరంజీవితో వరుసగా సినిమాలు చేశాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: