అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన్ మాస్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల అవనుంది. ఈ మేరకు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాదులో నిర్వహించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ అతిథిగా వచ్చిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ మెగాస్టార్, సూపర్ స్టార్ మరియు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారితో వేదిక భారీ నిండుతనాన్ని సంతరించుకుంది.

 

 

వఈ ముగ్గుర్ని ఒకే ఫ్రేమ్ లో చూడడం ప్రేక్షకులకి ఒక వరంగా అనిపించిందంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ ఈవెంట్ లో చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్ర ట్రైలర్ కామెడీగా సాగుతూ..మెల్లిగా సీరియస్ నెస్ ఆపాదించుకుని...ఆ తర్వాత మాస్ ఎలిమెంట్స్ తో ఆని వర్గాల ప్రేక్షకులని ఆకర్షించేలాగా చాలా బాగా కట్ చేశారు. ట్రైలర్ ని చూస్తుంటే సినిమా హిట్ అవడం పక్కా అన్నట్టుగానే ఉంది.

 

 

మొదటి నుండి సినిమాలో ట్రైన్ ఎపిసొడ్ అదిరిపోతుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం నిజమే అనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైలర్ లో ఇమిడ్చిన ట్రైన్ ఎపిసోడ్ లోని కొన్ని సీన్ కట్స్ ప్రేక్షకులని కట్టి పడేస్తున్నాయి. వినోదాన్ని పండించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి మరోసారి వినోదంతో అందరి చేత కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాడు. మొత్తానికి ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత అధికం చేసింది.

 

 

సంక్రాంతి బరిలో మొదటి సినిమాగా వస్తున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోతాయనే అనిపిస్తుంది. మరిపోయిన సంవత్సరం ఎఫ్ ౨ లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి హిట్ గా నిలుస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: