టాలీవుడ్ లో వరుసగా విజయాలు అందుకుంటున్నాడు అనీల్ రావిపూడి.  గత ఏడాది విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరెక్కించిన ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు లేకున్నా విడుదలైన అన్ని థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడం ఈ మూవీ కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది.  రామ్ చరణ్ నటించిన ‘వినయవిధేయ రామా’ మూవీ సైతం పక్కన పెట్టి ఎఫ్ 2 భారీగా కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాది మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనీల్ రావిపూడి.  ఈ మూవీపై ఇప్పటికే భారీ ఎత్తున అంచనాలె నెలకొంటున్నాయి.  మొదటిసారిగా మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.  ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటంటే.. పదమూడేళ్ల తర్వాత వెండితెరపై మళ్లీ కనిపించబోతున్నారు లేడీ అమితాబ్ విజయశాంతి.

 

చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్న విజయశాంతి అసలు సినిమాల్లో నటించరని భావించారు.. ఆమెకూడా ఇన్నాళ్లు ఎంత మంది దర్శకనిర్మాతలు వచ్చినా ఏ సినిమాకు అంగీకరించలేదు.  చాలా కాలం తర్వాత అనీల్ రావిపూడి కథ చెప్పడం.. మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారని ఆమె కూడా అంగీకరించడం జరిగిందట.  ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న లాల్ బహదూర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది.  ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడంతో అటు మెగా ఇటు మహేష్ ఫ్యాన్స్ తో స్టేడియం అంతా కోలాహలంగా మారిపోయింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, విజయశాంతి స్పీచ్ తో దుమ్మురేపారు..ఒకరకంగా ఫ్యాన్స్ ఎమోషన్ కి గురయ్యారు. 

 

ఇక గ్యాంగ్ లీడర్ జంట తమ ముందు కనిపించడంతో సంతోషంలో మునిగిపోయారు ఫ్యాన్స్.  చిరంజీవి ఛలోక్తులు.. విజయశాంతి కౌంటర్లు మొత్తానికి నిన్నటి ఈవెంట్ ఎంతో సందడితో ముగిసింది. వేడుక పూర్తైన త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు టీం పార్టీ మూడ్‌లోకి వెళ్ళారు. ఈవెంట్‌కి రాలేక‌పోయిన మ‌హేష్ భార్య నమ్ర‌త పార్టీలో వీరితో జాయిన్ అంది. అంద‌రు గ్రూపులుగా ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీ జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుండ‌గా, ఇందులో ర‌ష్మిక మంథాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందని..తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు చిత్ర యూనిట్.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: