గత కొంత కాలంగా వరస పరాజయాలతో డీలా పడ్డ కింగ్ నాగార్జున ఇక కమర్షియల్ సినిమాల జోలీకి పోకుండా ఈ సారి ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడు. అందులో భాగంగా మన్మథుడు 2 తరువాత కొంత గ్యాప్ తీసుకున్న నాగ్ ప్రస్తుతం నూతన దర్శకుడు సాల్మన్ డైరెక్షన్ లో వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సాంగ్స్ , హీరోయిన్ లేకుండా రియాలిస్టిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
నాగార్జున ,
విజయ్ వర్మ అనే ఎన్ ఐ ఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
2009 లో జరిగిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. మొన్నటి వరకు
హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోగా.. తదుపరి షెడ్యూల్
ముంబై లో జరుగనుంది. ఈనెల 9న నుండి జరుగనున్న ఈ షెడ్యూల్ లో నాగ్ అలాగే మిగితా నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిరంజన్
రెడ్డి , అన్వేష్
రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.
ఇక ఇటీవల నాగ్
బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అనే చిత్రం లో నటించాడు.
అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నాగ్ తోపాటు
అమితాబ్ బచ్చన్ ,రన్బీర్ కపూర్ , మౌనీ రాయ్ ,
అలియా బట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా నాగ్ హిందీలో
అజయ్ దేవగణ్ నటించిన రైడ్ ను తెలుగులో
రీమేక్ చేయాలనుకుంటున్నాడట. అయితే ఈ చిత్రం గురించి ఇప్పటివరకు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలుబడలేదు కానీ ఈరీమేక్ కు
డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేశాడని టాక్. పీఎస్వి గరుడ వేగ తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్
ప్రవీణ్ సత్తార్ రైడ్
రీమేక్ ను తెరకెక్కించనున్నాడట.