సూపర్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు- కన్నడ బ్యూటిరష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా  తెరకెక్కిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమైన పాత్ర తో సరిలేరు నీకెవ్వరు తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహర్షి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ అండ్ ఎఫ్ 2 వంటి ఇండస్ట్రీ బిగ్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సరిలేరు వస్తుండటంతో ముందు నుంచే ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఇంకా సినిమాపై హైప్ పెంచారు చిత్ర యూనిట్.

 

ఇక సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరబాద్ ఎల్‌బి స్టేడియంలో అత్యంత అట్టహాసంగా జరిగింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రిలో ఉన్న మెగాస్టార్ వంటి  హేమాహేమీల సమక్షంలో ఈ సినిమా ఈవెంట్ ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇంతకముందు భరత్ అనే నేను, సైరా కూడా ఎల్‌బి స్టేడియంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ఆ సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఆ సెంటిమెంట్ సరిలేరుకి కంటిన్యూ అవుతున్న నమ్మకంతో అటు మెగా అభిమానులు ఇటు సూపర్ స్టార్ అభిమానుల్లో సెంటిమెంటల్ గా గట్టిగా ఫిక్సైయ్యారు. 

 

ఇక ఈ ఈవెంట్ లో నేను మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. అన్నారు. దీన్ని బట్టి చూస్తే మాస్ సినిమా స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. నిజంగా అదే గనక నిజమైతే మరోసారి పోకిరి వంటి ఆల్ టైం రికార్డ్ మూవీ ని మరో సారి చూడొచ్చన్నమాట. అంతేకాదు.. ఎప్పుడూ లేనట్టుగా మహేశ్ నుంచి సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న మాట కూడా తెలిపాడు. ఈ మధ్యకాలంలో కాలంలో ఆయన సినిమాలు చాలా ఆలస్యమవుతున్నాయి. అందుకు భిన్నంగా తాజాగా తెరకెక్కిన సరిలేరు ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారు. అంటే మహెష్ నెక్స్ట్ సినిమా కూడా త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకులముందుకు తీసుకు వస్తారనమాట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: