సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి అభిమానులకి మరో గిఫ్ట్ కూడా ఇచ్చేశారు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది. హైద్రాబాద్ లోని కోకాపేట లో వేసిన భారీ సెట్స్ లో ఈ షూటింగ్ మొదలెట్టారు. ఫస్ట్ షెడ్యూల్ లో కొరటాల కొన్ని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయట. కొణిదల ప్రొడక్షన్స్ తో పాటు మాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు.

 
జనవరిలో మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అలాగే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట. ఈ సాంగ్‌లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో స్టెప్స్ వేయబోతుందని వార్త‌లు వ‌చ్చాయి. కానీ క్లారిటీ అయితే రాలేదు.

 

కాగా, ఎప్పటిలాగే కొరటాల శివ ఈ సినిమాను కూడా సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇక  ఇందులో చిరూ రెండు వేరియేషన్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్, కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: