స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. ఇంతకముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు ధీటుగా త్రివిక్రమ్ ఈ సినిమాని రూపొందించారు. అంతేకాదు ఇద్దరికి అల హ్యాట్రిక్ సినిమా కావడంతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఇక బన్నీ గత సినిమా నా పేరు సూర్య ఫ్లాప్ కావడంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని బన్నీ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నాడట.

 

ఇక దీనికి తోడు మహేష్ బాబు సరిలేరు పోటీగా ఉండటంతో ఎక్కడా తగ్గకూడదని బన్నీ డిసైడయ్యాడట. అందుకే మహెష్ బాబు ఈవెంట్ కంటే అల్లు అర్జున్ ఈవెంట్ ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేశరట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఇక తమన్ సాంగ్స్ తో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక ఈ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో అంచనాలను ఇంకా భారీగా పెంచ్డానికి చాలా కొత్తగా ప్రమోషన్స్ ని ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా కొత్తగా మ్యూజికల్ నైట్‌ను నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయత్రం యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సెర్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ స్టార్ సినిమాకి చేయబి విధంగా ఈ ఈవెంట్ ఉండబోతోందని చిత్ర యూనిట్ వెల్లడించారు.

 

ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌ను శ్రేయస్ మీడియా డిఫరెంట్‌గా .. ఎంతో కొత్తగా ప్లాన్ చేశారు. 52 అడుగుల పొడవు, 162 అడుగుల వెడల్పుతో అథిధుల కోసం స్టేజీని డెకరేట్ చేయడం ఆసక్తికరం. సౌత్ ఇండియాలో ఇంత భారీగా స్టేజ్ వెయ్యడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఫంక్షన్‌లో తమన్, శివమణి, సిద్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, లేడి కాశ్, రాహుల్ నంబియార్, అనురాగ్ కులకర్ణి, ప్రియ సిస్టర్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే ఎమ్.జె5 డాన్స్, ఇండియన్ రాగా వారు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఉండబోతోంది.

 

అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి ఇతర పాత్రల్లో నటించారు. అల్లు అర్జున్-పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రెండవ సినిమా అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్-పూజా హెగ్డే కాంబినేషన్ కూడా రెండవసారి కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: