'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. మొట్టమొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో సినిమా పై టాలీవుడ్ ఇండస్ట్రీలో భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. ఇదే తరుణంలో ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంట్రెస్ట్ నెలకొంది. 'బాహుబలి' సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మంచి మార్కెట్ ఏర్పడటంతో ఈ సినిమాని దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మరొక కొన్ని భాషల్లో విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.

 

ఈ నేపథ్యంలో సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ప్రస్తుతం రాజమౌళి ఫోకస్ అంతా ఎన్టీఆర్ క్యారెక్టర్ కి సంబంధించి మిగిలి ఉన్న బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయటానికి కష్టపడుతున్న తరుణంలో తాజాగా విజయవాడలో బందర్ రోడ్డులో హ్యాపీ మొబైల్ స్టోర్‌ ఓపెనింగ్ కార్యక్రమానికి రామ్ చరణ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చెర్రీ మాట్లాడుతూ... హ్యాపీ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నాడు. విజయవాడకు ఎప్పుడు వచ్చినా ఆనందంగా ఫీలవుతానని తెలిపాడు.

 

ఇదే సందర్భంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై మాట్లాడుతూ.. ఆ సినిమా65 శాతం పూర్తైందని తెలిపాడు. ఈ సినిమా జూలై 30న విడుదల కానుందని వెల్లడించాడు. సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నానని చెర్రీ పేర్కొన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రేక్షకులనందరినీ అలరిస్తుందన్నాడు. దీంతో రామ్ చరణ్ ఇచ్చిన అప్ డేట్ కి ఇండస్ట్రీతో పాటు అభిమానులు కూడా షేక్ అవ్వడం జరిగింది. మేటర్ ఏమిటంటే సినిమాకి సంబంధించి షూటింగ్ సగం కూడా అవ్వలేదని ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా రావడంతో వాటన్నిటికీ రామ్ చరణ్ చేసిన కామెంట్లు పులిస్టాప్ పెట్టినట్లు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: