సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియం లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడంతో చాలామంది మెగా అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు. స్టేడియం మొత్తం మెగా అభిమానులు మరియు సూపర్ స్టార్ అభిమానులతో నిండిపోయింది. ఎక్కడ కూడా గొడవ జరగకుండా అభిమానుల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా సరిలేరు సినిమా యూనిట్ టైట్ సెక్యూరిటీ స్టేడియం లో పెట్టారు. అయితే సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో సినిమాలో మహేష్ బాబు సరికొత్త యాంగిల్ లో కామెడీ పండించినట్లు అర్థమవుతుంది.

 

ఇదిలా ఉండగా తాజాగా సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ అదరగొట్టే రీతిలో ఉన్నట్లు ఆ సమయంలో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ కచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి థియేటర్లో పూనకాలు రావడం గ్యారెంటీ అని అంటున్నారు సినిమా యూనిట్ కి చెందిన వాళ్ళు. ఒకే ఫ్రేములో మహేష్ మరియు కృష్ణ సినిమాలో కనబడటం జరుగుతుందని ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తారీకున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకోవడం జరిగింది.

 

అనిల్ రావిపూడి ట్రైన్ లో కామెడీ ట్రాక్ ని చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగిందని సినిమాకి అదే హైలెట్ అవుతుందని ఎమోషనల్ పరంగా విజయశాంతి మరియు మహేష్ వారిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా హైలెట్ గా ఉంటాయని ఇండస్ట్రీ నుండి వినబడుతున్న టాక్. మొత్తంమీద చూసుకుంటే చాలా సంవత్సరాల తర్వాత అప్పట్లో మహేష్ బాబు నటించిన కొత్తలో టక్కరి దొంగ, వంశీ ఇంకా కొన్ని సినిమాలలో సూపర్ స్టార్ కృష్ణ నటించడం జరిగింది. అయితే ఆ తర్వాత చాన్నాళ్ల తర్వాత మళ్లీ మహేష్ బాబు సినిమాలో కృష్ణ నటిస్తుండటంతో ఇద్దరినీ ఒకే ఫ్రేములో చూడటానికి ఎంతగానో ఆతృతగా ఉన్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: