మహేష్ బాబు, యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ల కలయికలో ఏకే ఎంటెర్టైఅంమెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, తన కెరీర్ లో మొదటి సారి ఒక ఆర్మీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న,

 

హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లోఎంతో గ్రాండ్ లెవెల్లో జరిగింది. 
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఈ వేడుకకు వేలాదిగా ప్రేక్షకులు , ఫ్యాన్స్ తరలి రావడం జరిగింది. మహేష్ బాబుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూసినపుడు తాను అలానే కాసేపు చూస్తూ ఉన్నానని చెప్పిన మెగాస్టార్, ఆ తరువాత ఈ సినిమా అప్పటికే పూర్తి అయినట్లు తెలియగానే, కేవలం ఐదు నెలల్లో ఎలా పూర్తి చేసారా అని ఆశ్చర్యం వేసిందని అన్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తనకు ఆహ్వానించగానే వెంటనే వస్తానని చెప్పానని కూడా అన్నారు. ఇక థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తుంటే సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని అర్ధం అవుతోందని చెప్పారు. ఇక ఈ ఫంక్షన్ లో తనదైన మ్యూజిక్ టాలెంట్ తో స్టేజ్ పై పలు మెగాస్టార్

 

సూపర్ స్టార్ పాటలు పాడిన దేవిశ్రీ ప్రసాద్, ఫంక్షన్ పూర్తి అయ్యే సమయంలో చిరు, మహేష్ లతో కలిసి ఒక సెల్ఫీ దిగాడు. అనంతరం ఆ సెల్ఫీని తన సోష మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన దేవిశ్రీ, ఇది నెంబర్ వన్ సెల్ఫీ అంటూ దానికి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. సరిలేరు ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ గారికి కృతజ్ఞతలు తెల్పిన దేవి, ఈ సినిమాకు పనిచేసే అవకాశాన్ని కల్పించిన దర్శకుడు అనిల్, అలానే హీరో సూపర్ స్టార్ మహేష్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. కాగా దేవి పోస్ట్ చేసిన ఆ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: