టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.  ఈ మూవీకి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మూవీలో దాదాపు పదిహేనేళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్.. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి నటిస్తున్నారు. నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్ బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు.  మొత్తానికి పెద్దల రాకతో ప్రీ రిలీజ్ వేడుక కాస్త చాలా కలర్ ఫుల్ గా సాగింది. ఈ కార్యక్రమానికి హూస్ట్ గా సుమా కనకాల వ్యవహరించారు.  సాధారణంగా ఇలాంటి పెద్ద వేడుకలకు సుమ వ్యాఖ్యతగా వ్యవహరించడం చాలా కామన్ గా చూస్తూనే ఉంటాం. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ పంచ్ లు వేస్తూ నవ్వులు పూయిస్తుంది.  

 

ఇక రష్మిక స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడుతూ.. చిరంజీవి గారు తన ఛలో , గీత గోవిందం సినిమా ఆడియో ఫంక్షన్లకు ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు అంటూ గుర్తు చేసుకుంది. దాంతో వెంటనే ఆమె వద్ద ఉన్న మైక్ అందుకొని ఆ రెండు ఫంక్షన్లకు నేనే హూస్ట్.. మరి నీ సక్సెస్ లో నాకు కూడా క్రెడిట్ ఉంది అంటూ పంచ్ వేశారు.  మనలో మనమాట ఎవరి డబ్బా వారు కొట్టుకోవాలి అంటూ మాట అనేసి మైక్ రష్మికకు అప్పగించింది. ఇక ఇదే వేడుకలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. తనను బ్లేడ్ గణేష్ అనొద్దని.. ఇక నుంచి నా పూర్తి ద్యాస సినిమాలే అని వేరే దాని జోలికి వెళ్లనని అన్నారు.

 

ఆ తర్వాత ఇక్కడ హీరో గురించి.. ఇతర వాటి గురించి చెప్పుకోవడమే కాదు నాకు గురించి కూడా చెప్పుకోవాలి.. ఈ మూవీలో నాది పదినిమిషాల పాత్ర ఇరగదీశాను అన్నారు.  ఇలా సరిలేరు నీకెవ్వరు వేధికపై ఎవరి డబ్బా వారు కొట్టుకోవడం పై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి వ్యాఖ్యలు రకరకాల చర్చలకు తెర లేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: