టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘అలా వైకుంఠపురములో’ మూవీ తెరకెక్కుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ మూవీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ 2020, జనవరి 12న విడుదలవుతుంది.  ఈ మూవీకి సంబంధించిన ఇప్పటికే పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా  యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్’ ని వినూత్నంగా జరపబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

 

మ్యూజికల్ ఫెస్టివల్ ఈవెంట్ ను శ్రేయస్ మీడియా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. ఈ ఫంక్షన్లో తమన్, శివమణి, సిద్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్, రాహుల్ సిప్లిగoజ్, రోల్ రైడ, లేడి కాశ్, రాహుల్ నంబియర్, అనురాగ్ కులకర్ణి, ప్రియ సిస్టర్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.  ఎమ్.జె5 డాన్స్ , ఇండియన్ రాగా వారు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.  ఈ వేడుకను చూసేందుకు ఫ్యాన్స్ భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.  ఇప్పటికే హంగామా మొదలైంది.  ఇక మూవీ విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లిరిక్స్, టిజర్ కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది.  


గతంలో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మూవీ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసింది. అలాగే దువ్వాడజగన్నాథం మూవీ తర్వాత అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే రెండోసారి నటిస్తుంది.  ఈ మూవీలో  టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: